ఈజిప్ట్లో సౌదీ యువరాజు..పలు ఒప్పందాలపై సంతకాలు
- March 05, 2018
కైరో : సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆదివారం ఈజిప్ట్కు చేరుకున్నారు. గతేడాది యువరాజు అయిన తర్వాత రాజకీయ, ఆర్థిక రంగ ప్రక్షాళనకు చర్యలు చేపట్టిన నేపథ్యంలో మొదటిసారిగా ఆయన విదేశీ పర్యటనకు వచ్చారు. మూడు రోజులు పాటు కైరోలో వుండి అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా అల్ శిశితో సమావేశమవుతారు. కైరోతో సౌదీ యువరాజు పలు ఒప్పందాలను కుదుర్చుకుంటారని భావిస్తున్నారు. అనంతరం 7వ తేదీన బ్రిటన్ వెళతారు. ఈ నెల చివరిలో అమెరికాలో పర్యటిస్తారు. ప్రాంతీయ అంశాలపై చర్చించడానికి, తీవ్రవాదంపై పోరు సల్పడానికి గల మార్గాలను అన్వేషించడానికి రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈజిప్ట్ అధ్యక్షుడిని ఆహ్వానించారని ఈజిప్ట్ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









