ఒమన్లో బస్సు ప్రమాదం: ముగ్గురు స్కూల్ స్టూడెంట్స్ మృతి
- March 05, 2018
మస్కట్: జబల్ అఖ్దర్ స్కూల్కి చెందిన ముగ్గురు స్టూడెంట్స్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. స్కూల్ బస్ డ్రైవర్, కంట్రోల్ తప్పడమే ఈ ప్రమాదానికి కారణంగా రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. నిజ్వా విలాయత్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 12 మంది మేల్ స్టూడెంట్స్ ఉన్నారు. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, తొమ్మిదిమందికి గాయాలయ్యాయి. గాయాలపాలైనవారిని జబల్ అఖ్దర్ హెల్త్ సెంటర్కి తరలించారు. ప్రమాదం గురించి తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది గాయపడ్డవారిని ఎయిర్ లిఫ్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రాయల్ ఒమన్ పోలీస్, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు సూచించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







