హైదరాబాద్ చేరుకున్న కువైట్ ఆమ్నెస్టీ బాధితులు
- March 06, 2018
హైదరాబాద్:కువైట్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్షను ఉపయోగించుకొని, APNRT సమకూర్చిన ఉచిత టికెట్లతో 25 మంది ప్రవాసాంధ్రులు తొలి విడతలో తిరిగి వచ్చారు. ఈరోజు(06-03-18) ఉదయం 1:30 గంటలకు మొదటి విడతగా ప్రవాసులు జజీరా ఎయిర్ వేస్ లో కువైట్ నుండి హైదరాబాద్ ఎయిర్ పోర్టు కు వచ్చారు ఆ తర్వాత APNRT ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలలో వారి వారి స్వగ్రామమునకు వెళ్లారు. మొత్తం ౩౦౦౦ వేలమందికి పైగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోనున్నారు. APNRT MRC డైరెక్టర్ చప్పిడి రాజశేఖర్ , స్మార్ట్ విలేజ్ కోఆర్డినేటర్ ఆర్.దినేష్ మరియు ఇతర బృందం హైదరాబాదు ఎయిర్ పోర్టు లో అంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వీరికి ఘన స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వారందరికి వారి సొంత ప్రాంతాలలో 3 నెలల పాటు ఉచిత నైపుణ్యాభివృద్ది శిక్షణ ఇవ్వనున్నట్లు NRI మంత్రి కొల్లు రవీంద్ర , APNRT అధ్యక్షుడు డా.రవికుమార్ పి.వేమూరు మరియు CEO కె. సాంబశివరావు తెలిపారు.


తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









