హైదరాబాద్ చేరుకున్న కువైట్ ఆమ్నెస్టీ బాధితులు
- March 06, 2018
హైదరాబాద్:కువైట్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్షను ఉపయోగించుకొని, APNRT సమకూర్చిన ఉచిత టికెట్లతో 25 మంది ప్రవాసాంధ్రులు తొలి విడతలో తిరిగి వచ్చారు. ఈరోజు(06-03-18) ఉదయం 1:30 గంటలకు మొదటి విడతగా ప్రవాసులు జజీరా ఎయిర్ వేస్ లో కువైట్ నుండి హైదరాబాద్ ఎయిర్ పోర్టు కు వచ్చారు ఆ తర్వాత APNRT ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలలో వారి వారి స్వగ్రామమునకు వెళ్లారు. మొత్తం ౩౦౦౦ వేలమందికి పైగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోనున్నారు. APNRT MRC డైరెక్టర్ చప్పిడి రాజశేఖర్ , స్మార్ట్ విలేజ్ కోఆర్డినేటర్ ఆర్.దినేష్ మరియు ఇతర బృందం హైదరాబాదు ఎయిర్ పోర్టు లో అంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వీరికి ఘన స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వారందరికి వారి సొంత ప్రాంతాలలో 3 నెలల పాటు ఉచిత నైపుణ్యాభివృద్ది శిక్షణ ఇవ్వనున్నట్లు NRI మంత్రి కొల్లు రవీంద్ర , APNRT అధ్యక్షుడు డా.రవికుమార్ పి.వేమూరు మరియు CEO కె. సాంబశివరావు తెలిపారు.


తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







