హైదరాబాద్ చేరుకున్న కువైట్ ఆమ్నెస్టీ బాధితులు
- March 06, 2018
హైదరాబాద్:కువైట్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్షను ఉపయోగించుకొని, APNRT సమకూర్చిన ఉచిత టికెట్లతో 25 మంది ప్రవాసాంధ్రులు తొలి విడతలో తిరిగి వచ్చారు. ఈరోజు(06-03-18) ఉదయం 1:30 గంటలకు మొదటి విడతగా ప్రవాసులు జజీరా ఎయిర్ వేస్ లో కువైట్ నుండి హైదరాబాద్ ఎయిర్ పోర్టు కు వచ్చారు ఆ తర్వాత APNRT ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలలో వారి వారి స్వగ్రామమునకు వెళ్లారు. మొత్తం ౩౦౦౦ వేలమందికి పైగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోనున్నారు. APNRT MRC డైరెక్టర్ చప్పిడి రాజశేఖర్ , స్మార్ట్ విలేజ్ కోఆర్డినేటర్ ఆర్.దినేష్ మరియు ఇతర బృందం హైదరాబాదు ఎయిర్ పోర్టు లో అంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వీరికి ఘన స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వారందరికి వారి సొంత ప్రాంతాలలో 3 నెలల పాటు ఉచిత నైపుణ్యాభివృద్ది శిక్షణ ఇవ్వనున్నట్లు NRI మంత్రి కొల్లు రవీంద్ర , APNRT అధ్యక్షుడు డా.రవికుమార్ పి.వేమూరు మరియు CEO కె. సాంబశివరావు తెలిపారు.


తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







