కార్మిక చట్టం ఉల్లంఘించినందుకు 247 మంది ప్రవాసీయులు అరెస్ట్
- March 11, 2018
మస్కట్ : కార్మిక చట్టం ఉల్లంఘించిన నేరానికి 247 మంది ఆసియా మరియు ఆఫ్రికన్ జాతీయులను రాయల్ ఒమాన్ పోలీసులు ఇతర ప్రభుత్వ సంస్థలతో సహకారంతో అరెస్ట్ చేశారు. వీరిలో 199 మంది మహిళలు, 48 మంది పురుషులు ఉన్నారు. మస్కాట్ లో విచారణ, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం స్పెషల్ టాస్క్ ఫోర్స్, మానవ వనురుల శాఖ , బాషేర్ మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ సహకారంతో వారిని అదుపులోనికి తీసుకొన్నారు. " ఈ సందర్భంగా రాయల్ ఒమాన్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు " మా గల్ఫ్ న్యూస్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, వారు బాషేర్ లోని వివిధ ప్రదేశాల నుండి అరెస్టు చేయబడ్డారని తెలిపారు. వీరిలో అత్యధికులు చేసిన నేరాలు ఏమిటంటే చట్టవిరుద్ధంగా దేశంలో ప్రవేశించడం, కార్మిక మరియు నివాస చట్టాల ఉల్లంఘన, మోసం, వ్యభిచారం మరియు మానవ అక్రమ రవాణా వంటివిఉన్నాయి. వీరి నేరాలపై దర్యాప్తు పూర్తిచేయడానికి నిందితులను న్యాయ అధికారుల ఎదుటకు సూచించబడ్డారు.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







