237 మంది అక్రమ వలసదారులను రక్షించిన లిబియా నౌకాదళ సిబ్బంది
- March 11, 2018
ట్రిపోలీ: లిబియా వైపు అక్రమంగా ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైన బోటులో వున్న దాదాపు 237 మందిని తమ నౌకాదళ సిబ్బంది సురక్షితంగా తీరానికి చేర్చారని లిబియా ప్రభుత్వం ప్రకటించింది. లిబియా వైపు రెండు బోట్లలో అక్రమంగా తరలి వస్తున్న దాదాపు 237 మంది ప్రయాణీకులను లిబియాలోని అజ్ జవాఇయా తీర ప్రాంతంలో నీట మునగకుండా సురక్షితంగా తీరానికి చేర్చినట్లు అధికార అనడోలు వార్తా సంస్థ వెల్లడించింది. 44 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులతో వున్న ఈ వసలదారుల బృందంలో అధికశాతంమంది ఆఫ్రికాకు చెందిన వారేనని, ఒకరిద్దరు బంగ్లాదేశ్కు చెందిన వారుండవచ్చని ఈ ప్రకటనలో వివరించారు. వారికి వైద్య సదుపాయంతో పాటు అవసరమైన మానవతా సాయం కూడా అందచేస్తున్నామని ఈ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







