ప్రకాశం జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా..
- November 29, 2015
ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారిపై ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలో సోమవారం ఉదయం పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా, బస్సులో ఉన్న 40 మంది విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒంగోలు రైల్వేస్టేషన్ సమీపంలోని సెయింట్ మేరీస్ పాఠశాల బస్సు త్రోవగుంట వైపు నుంచి ఒంగోలు వస్తుండగా లారీ వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. సమాచారం అందుకున్న తాలూకా పోలీస్స్టేషన్ ఎస్సై ఆంటోనీ రాజ్ ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. తీవ్రంగా గాయపడి బస్సులోనే ఇరుకుపోయిన డ్రైవర్ను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







