గృహ సంబంధిత ఉల్లంఘనలపై అబుదాబి సిటీ మునిసిపాలిటీ ఉక్కుపాదం
- March 14, 2018అబూధాబి: వాణిజ్య భవనాలు ఉండే ప్రాంతాలలోని వసతి గృహలలో ఎక్కువ మంది ప్రజలు కిక్కిరిసిపోయి నివసించడంపై అధికారులు విస్తృతమైన తనిఖీలు నిర్వహించారు. ఈ అవగాహన ప్రచారం అల్ వాత్బాలోని కేంద్రం ద్వారా అబుదాబి సిటీ మునిసిపాలిటీ ఇటీవల ప్రారంభించించి బనియాస్, షావమేఖ్ మరియు అల్ వాత్బాలోని అనేక ప్రాంతాలలో భవనాల వెలుపల సైతం తనిఖీలు నిర్వహించబడ్డాయి. ఆరోగ్యం , భద్రతా ప్రమాణాలు ఈ ప్రచారం ద్వారా మెరుగుపర్చేందుకు అధికారులు చర్యలు తీసుకొన్నారు. ఈ తనిఖీలు ఇవి నగర సుందిరీకరణ ప్రదర్శనల ప్రమాణాలకు అనుకూలంగా ఉంటాయి. వివిధ ప్రాంతాలలో 96 తనిఖీ పరీక్షల ఫలితంగా,మునిసిపాలిటీ 14 ఉల్లంఘనలను జారీ చేసింది. ఈ మొత్తం10 వేల అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ నుంచి 1 లక్ష అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ కంటే తక్కువ కాకుండా జరిమానా చెల్లించాల్సిఉంది. అవే తప్పులను ఉల్లంఘనదారులు మళ్ళీ చేస్తే 1 లక్ష అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ తక్కువ కాకుండా 2 లక్షల అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ లను జరిమానాగా విధించనున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం