16 వేలమంది ఉద్యోగార్థులు ప్రయివేట్ ఉద్యోగాలలో నియమితులయ్యారు
- March 15, 2018
మస్కట్ : ఉద్యోగార్థుల కోసం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు నిరంతరాయంగా కృషి చేస్తూనే ఉన్నాయి. మంత్రుల మండలి ఆమోదం పొందిన తర్వాత డిసెంబర్ 3 వ తేదీ 2017 నుండి ఈ ఏడాది మార్చి 12 వ తేదీ వరకు వివిధ గవర్నరేటర్లలో 16,504 మంది పౌరులు వివిధ ప్రైవేటురంగ సంస్థలలో నియమితుల య్యారని మానవ వనురుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగాలు పొందినవారిలో పురుషుల సంఖ్య 11,121 గా ఉండగా, మహిళల సంఖ్య 5,383 గా ఉన్నట్లు తెలిపింది. ఉద్యోగులను పొందినవారిలో జనరల్ ఎడ్యుకేషన్ డిప్లొమా కన్నా తక్కువ విద్యార్హత కలవారు 8,186 మంది , సాధారణ విద్య డిప్లొమా కలవారు 5,520 మంది, హయ్యర్ ఎడ్యుకేషన్ డిప్లొమా లేదా యూనివర్సిటీ డిగ్రీ చదువుకున్నవారు 2,798 మంది ఉన్నారు. ఉద్యోగ నియామకాలలో టోకు, రిటైల్ వాణిజ్యం, ఉత్పాదక రంగాల విభాగాలు నిర్మాణ రంగంలో 33.4 శాతం మంది, టోకు మరియు చిల్లర వర్తక రంగంలో 14.5 శాతం ఉండగా, అలాగే ఉత్పాదక రంగంలో 13.7 శాతం మంది నియమితులయ్యారు.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









