16 వేలమంది ఉద్యోగార్థులు ప్రయివేట్ ఉద్యోగాలలో నియమితులయ్యారు
- March 15, 2018
మస్కట్ : ఉద్యోగార్థుల కోసం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు నిరంతరాయంగా కృషి చేస్తూనే ఉన్నాయి. మంత్రుల మండలి ఆమోదం పొందిన తర్వాత డిసెంబర్ 3 వ తేదీ 2017 నుండి ఈ ఏడాది మార్చి 12 వ తేదీ వరకు వివిధ గవర్నరేటర్లలో 16,504 మంది పౌరులు వివిధ ప్రైవేటురంగ సంస్థలలో నియమితుల య్యారని మానవ వనురుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగాలు పొందినవారిలో పురుషుల సంఖ్య 11,121 గా ఉండగా, మహిళల సంఖ్య 5,383 గా ఉన్నట్లు తెలిపింది. ఉద్యోగులను పొందినవారిలో జనరల్ ఎడ్యుకేషన్ డిప్లొమా కన్నా తక్కువ విద్యార్హత కలవారు 8,186 మంది , సాధారణ విద్య డిప్లొమా కలవారు 5,520 మంది, హయ్యర్ ఎడ్యుకేషన్ డిప్లొమా లేదా యూనివర్సిటీ డిగ్రీ చదువుకున్నవారు 2,798 మంది ఉన్నారు. ఉద్యోగ నియామకాలలో టోకు, రిటైల్ వాణిజ్యం, ఉత్పాదక రంగాల విభాగాలు నిర్మాణ రంగంలో 33.4 శాతం మంది, టోకు మరియు చిల్లర వర్తక రంగంలో 14.5 శాతం ఉండగా, అలాగే ఉత్పాదక రంగంలో 13.7 శాతం మంది నియమితులయ్యారు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







