అమెరికా లో కుప్పకూలిన ఓవర్ బ్రిడ్జి
- March 15, 2018
అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. అందరూ చూస్తుండగానే ఫుట్ ఓవర్ బ్రిడ్జి కుప్పకూలింది.. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో 9 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన అమెరికాలోని మియామిలో చోటుచేసుకుంది. భారత్ కాలమానం ప్రకారం ఈ ఘటన గురువారం సాయంత్రం జరిగింది. బ్రిడ్జి కింద వాహనాలు చిక్కుకోవడంతో మృతులసంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం. కాగా ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, సిటీ ఆఫ్ స్వీట్వాటర్ను అనుసంధానించి విద్యార్థులు దాటేందుకు ఈ బ్రిడ్జిని నిర్మించారు. కేవలం నెలల వ్యవధిలోనే ప్రారంభించిన ఈ బ్రిడ్జి, ఒక్కసారిగా కూలడంతో సదరు ఇంజినీర్లు , కాంట్రాక్టర్ పై వేటుపడే అవకాశముందని అక్కడి ప్రభుత్వ వర్గాలు దృవీకరిస్తున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సహాయకచర్యలను దగ్గరుండి చూసుకోవాలని హెల్త్ అండ్ రెస్క్యూ హెడ్ టామ్ ప్రైస్ ను ఆదేశించారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం









