అమెరికా లో కుప్పకూలిన ఓవర్ బ్రిడ్జి
- March 15, 2018
అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. అందరూ చూస్తుండగానే ఫుట్ ఓవర్ బ్రిడ్జి కుప్పకూలింది.. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో 9 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన అమెరికాలోని మియామిలో చోటుచేసుకుంది. భారత్ కాలమానం ప్రకారం ఈ ఘటన గురువారం సాయంత్రం జరిగింది. బ్రిడ్జి కింద వాహనాలు చిక్కుకోవడంతో మృతులసంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం. కాగా ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, సిటీ ఆఫ్ స్వీట్వాటర్ను అనుసంధానించి విద్యార్థులు దాటేందుకు ఈ బ్రిడ్జిని నిర్మించారు. కేవలం నెలల వ్యవధిలోనే ప్రారంభించిన ఈ బ్రిడ్జి, ఒక్కసారిగా కూలడంతో సదరు ఇంజినీర్లు , కాంట్రాక్టర్ పై వేటుపడే అవకాశముందని అక్కడి ప్రభుత్వ వర్గాలు దృవీకరిస్తున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సహాయకచర్యలను దగ్గరుండి చూసుకోవాలని హెల్త్ అండ్ రెస్క్యూ హెడ్ టామ్ ప్రైస్ ను ఆదేశించారు.
తాజా వార్తలు
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!







