అమెరికా లో కుప్పకూలిన ఓవర్ బ్రిడ్జి
- March 15, 2018
అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. అందరూ చూస్తుండగానే ఫుట్ ఓవర్ బ్రిడ్జి కుప్పకూలింది.. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో 9 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన అమెరికాలోని మియామిలో చోటుచేసుకుంది. భారత్ కాలమానం ప్రకారం ఈ ఘటన గురువారం సాయంత్రం జరిగింది. బ్రిడ్జి కింద వాహనాలు చిక్కుకోవడంతో మృతులసంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం. కాగా ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, సిటీ ఆఫ్ స్వీట్వాటర్ను అనుసంధానించి విద్యార్థులు దాటేందుకు ఈ బ్రిడ్జిని నిర్మించారు. కేవలం నెలల వ్యవధిలోనే ప్రారంభించిన ఈ బ్రిడ్జి, ఒక్కసారిగా కూలడంతో సదరు ఇంజినీర్లు , కాంట్రాక్టర్ పై వేటుపడే అవకాశముందని అక్కడి ప్రభుత్వ వర్గాలు దృవీకరిస్తున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సహాయకచర్యలను దగ్గరుండి చూసుకోవాలని హెల్త్ అండ్ రెస్క్యూ హెడ్ టామ్ ప్రైస్ ను ఆదేశించారు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







