అమెరికా లో కుప్పకూలిన ఓవర్ బ్రిడ్జి
- March 15, 2018
అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. అందరూ చూస్తుండగానే ఫుట్ ఓవర్ బ్రిడ్జి కుప్పకూలింది.. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో 9 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన అమెరికాలోని మియామిలో చోటుచేసుకుంది. భారత్ కాలమానం ప్రకారం ఈ ఘటన గురువారం సాయంత్రం జరిగింది. బ్రిడ్జి కింద వాహనాలు చిక్కుకోవడంతో మృతులసంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం. కాగా ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, సిటీ ఆఫ్ స్వీట్వాటర్ను అనుసంధానించి విద్యార్థులు దాటేందుకు ఈ బ్రిడ్జిని నిర్మించారు. కేవలం నెలల వ్యవధిలోనే ప్రారంభించిన ఈ బ్రిడ్జి, ఒక్కసారిగా కూలడంతో సదరు ఇంజినీర్లు , కాంట్రాక్టర్ పై వేటుపడే అవకాశముందని అక్కడి ప్రభుత్వ వర్గాలు దృవీకరిస్తున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సహాయకచర్యలను దగ్గరుండి చూసుకోవాలని హెల్త్ అండ్ రెస్క్యూ హెడ్ టామ్ ప్రైస్ ను ఆదేశించారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









