ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం
- March 15, 2018
ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. ఆదిశగానే బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించిందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రజాసమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వహించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రి కేటీఆర్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కేన్సర్తో బాధపడుతున్న బీడి కార్మికురాలికి చికిత్స చేయిస్తానని హామీ ఇచ్చారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. అసెంబ్లీ సమావేశాల తరువాత జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన.. రెండు కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. శివనగర్, వెంకట్రావునగర్లో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన పబ్లిక్ పార్క్లను మంత్రి ప్రారంభించారు.తరువాత జేపీనగర్, బీవై నగర్, గవేష్నగర్, సాయినగర్లో వివిధ వర్గాలకు చెందిన కమ్యూనిటీ హాళ్లకు ప్రారంభోత్సవం చేశారు.
పేద ప్రజల అభ్యున్నతకి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. ప్రజా సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వం రాజీపడబోదన్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం తరువాత స్థానికులతో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు సెస్ సిబ్బంది సహకరించడం లేదని మున్సిపల్ సిబ్బంది కేటీఆర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ సంస్థ చైర్మన్ లక్ష్మారెడ్డిపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు.
మంత్రి కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. పెద్దూరుకు వచ్చిన మంత్రి కేటీఆర్కు స్థానిక నేతలు.. కేన్సర్ తో బాధపడుతున్న బీడీ కార్మికురాలు రాజేశ్వరి దీనావస్థను వివరించారు. స్పందించిన ఆయన.. ఆమెను అన్ని విధాల ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయిస్తానని, అక్కడికి తీసుకురావాలని వారికి సూచించారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ







