రస్ అల్ ఖైమాలో రోడ్డు ప్రమాదం 34 ఏళ్ళ ఎమిరేటీ మృతి
- March 16, 2018
రస్ అల్ ఖైమా:34 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి రస్ అల్ ఖైమాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అల్ రామ్స్ ప్రాంతంలో 19 ఏళ్ళ వ్యక్తి నడుపుతున్న కారు దూసుకెళ్ళడంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు అల్ రామ్స్ పోలీస్ స్టేషన్ చీఫ్ - కల్నల్ ఇబ్రహీమ్ మొహమ్మద్ మట్టర్ చెప్పారు. ప్రమాదం గురించి సమాచారం అందగానే ట్రాఫిక్ పెట్రోల్, అంబులెన్స్, పారామెడిక్స్, రెస్క్యూ టీమ్ని సంఘటనా స్థలానికి పంపించామని చెప్పారాయన. బాధితుడ్ని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలూ చేశామనీ, దురదృష్టవశాత్తూ అతని ప్రాణాలు కాపాడలేకపోయామని వివరించారు కల్నల్ ఇబ్రహీమ్. మృతదేహాన్ని మార్గ్యుకి తరలించారు. వాహనదారులు రాత్రి వేళల్లో తమ వాహనాలు నడిపేటప్పుడు మరింత అప్రమత్తంగా వుండాలనీ ఈ సందర్భంగా కల్నల్ చెప్పారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









