జన్మభూమిని సందర్శించిన కువైట్ లో భారత రాయబారి కె.జీవ సాగర్
- March 17, 2018


మచిలీపట్నం: బందరు ఆణిముత్యం...నోబుల్ కాలనీకు గర్వ కారణం ..నోబుల్ కాలేజీ పూర్వ విద్యార్థి ...1991 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ర్యాంకర్ ..ఎన్నో దేశాలలో భారత్ తరుపున అంబాసిడర్ గా పనిచేసి ప్రస్తుతం కువైట్ దేశంలో భారతదేశం తరుపున రాయబారి కాకరవాడ జీవసాగర్ శనివారం తన జన్మస్థలమైన బందరు వచ్చారు. నోబుల్ కాలేజీ 175 సంవత్సరాల వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన నోబుల్ కాలనీ వాసులను పేరు పేరునా పలకరించారు. ఈ ఫోటోలో ఎడమ నుంచి కుడివైపునకు హెరాల్డ్ నిర్మల్ కుమార్, (మేనేజర్) ఎన్. జాన్సన్ జాకబ్, ( జర్నలిస్ట్ ) లాల్ (రిటైర్ ఎస్పీ ప్రేమ్ కుమార్ తమ్ముడు), కె. ఐజాక్ సుగుణాకర్ (నోబెల్ ప్యారీష్ చర్చి సెక్రటరీ), అజిత్ దివాకర్ (రియల్ ఎస్టేట్ కంపెనీ .ఎం.డి). అనంతరం " బందరు బంధువుల " ఫేస్బుక్ , నోబుల్ కాలేజ్ మచిలీపట్నం అల్యూమిన్ గ్రూప్ గురించి వివరాలు అడిగి తెలుసుకొన్నారు..ఈసారి వచ్చినపుడు అందరిని కలుస్తానని తెలిపారు.

తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







