బ్రెజిల్లో ఎల్లో ఫీవర్తో 300మంది మృతి
- March 17, 2018
గత జులై నుండి ఇప్పటివరకు ఎల్లో ఫీవర్తో 300 మంది మరణించారని బ్రెజిల్ ధృవీకరించింది. మొత్తంగా ఈ ఇన్ఫెక్షన్లకు సంబంధించి 920 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక నివేదికలో తెలిపింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య రెట్టింపు అయిందని పేర్కొంది. ఎల్లో ఫీవర్ వ్యాధి తీవ్రంగా విస్తరిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు అత్యవసర పరిస్థితి విధించలేదు. అంతకుముందు ఎమర్జన్సీ విధించారు. జనాభా ఎక్కువున్న ప్రాంతాల్లో వైరస్ బాగా ప్రబలంగా వుండడంతో ఇన్ఫెక్షన్లు పెరిగాయని, అందుకే ఎమర్జన్సీ విధించాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. దేశంలోని శావోపాలో, రియో డీ జెనీరో, మినాస్ గెరాస్ వంటి జనాభా ఎక్కువున్న రాష్ట్రాల్లోనే ఈ మరణాలు సంభవించాయి. కాగా, ఇప్పటివరకు మూడు రాష్ట్రాల్లోని కోటీ 78లక్షల మందికి ఈ వ్యాధి రాకుండా టీకాలు వేశారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..







