బ్రెజిల్లో ఎల్లో ఫీవర్తో 300మంది మృతి
- March 17, 2018
గత జులై నుండి ఇప్పటివరకు ఎల్లో ఫీవర్తో 300 మంది మరణించారని బ్రెజిల్ ధృవీకరించింది. మొత్తంగా ఈ ఇన్ఫెక్షన్లకు సంబంధించి 920 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక నివేదికలో తెలిపింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య రెట్టింపు అయిందని పేర్కొంది. ఎల్లో ఫీవర్ వ్యాధి తీవ్రంగా విస్తరిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు అత్యవసర పరిస్థితి విధించలేదు. అంతకుముందు ఎమర్జన్సీ విధించారు. జనాభా ఎక్కువున్న ప్రాంతాల్లో వైరస్ బాగా ప్రబలంగా వుండడంతో ఇన్ఫెక్షన్లు పెరిగాయని, అందుకే ఎమర్జన్సీ విధించాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. దేశంలోని శావోపాలో, రియో డీ జెనీరో, మినాస్ గెరాస్ వంటి జనాభా ఎక్కువున్న రాష్ట్రాల్లోనే ఈ మరణాలు సంభవించాయి. కాగా, ఇప్పటివరకు మూడు రాష్ట్రాల్లోని కోటీ 78లక్షల మందికి ఈ వ్యాధి రాకుండా టీకాలు వేశారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!