గల్ఫ్ కార్మికుల సంక్షేమంకై తెలంగాణ ప్రభుత్వాన్ని కలిసిన గల్ఫ్ ప్రవాసీయులు
- March 18, 2018
తెలంగాణ ప్రభుత్వ సచివాలయంలో "ప్రవాస హక్కులు మరియు సంక్షేమ వేదిక" ఆధ్వర్యంలో దుబాయ్ నుండి వెళ్లిన ప్రతినిధి బృందం తెలంగాణ ఆర్ధిక శాఖ మాత్యులు శ్రీ ఈటెల రాజేందర్ ని కలుసుకొని గల్ఫ్ కార్మికులు మరియు బాధితుల తరపున 2018-2019 బడ్జెట్లో ఎన్ ఆర్ ఐ సెల్ కు వంద కోట్లు కేటాయించడముపై కృతజ్ఞతలు మరియు హర్షం వ్యక్తం చేస్తూనే దానికి సంభందించిన విధి విధానాలను మరియు గల్ఫ్ సంక్షేమానికి ఆవిధంగా వినియోగిస్తారో తెలియజేయవలసిందిగా కోరడం జరిగింది. దీనికి స్పందించిన మంత్రివర్యులు ప్రభుత్వం తరపున దీనికి సంబంధించిన విధి విధానాల ప్రకటనను త్వరలోనే విడుదల చేస్తుందని తెలియజేసారు, మరియు తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులు మరియు సంక్షేమం పట్ల సానుకూలంగా ఉందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అద్యక్షులు ఏమూల రమేష్ గారు, సురునిదా అరుణ్ కుమార్, అజయ్ తెడ్డు, దండిగూడెం క్రాంతి కుమార్, నందికంటి చరణ్, మరియు తెలంగాణ ధూమ్ ధామ్ కళాకారులు శ్రీ మారంపల్లి రవీందర్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







