గల్ఫ్ కార్మికుల సంక్షేమంకై తెలంగాణ ప్రభుత్వాన్ని కలిసిన గల్ఫ్ ప్రవాసీయులు
- March 18, 2018
తెలంగాణ ప్రభుత్వ సచివాలయంలో "ప్రవాస హక్కులు మరియు సంక్షేమ వేదిక" ఆధ్వర్యంలో దుబాయ్ నుండి వెళ్లిన ప్రతినిధి బృందం తెలంగాణ ఆర్ధిక శాఖ మాత్యులు శ్రీ ఈటెల రాజేందర్ ని కలుసుకొని గల్ఫ్ కార్మికులు మరియు బాధితుల తరపున 2018-2019 బడ్జెట్లో ఎన్ ఆర్ ఐ సెల్ కు వంద కోట్లు కేటాయించడముపై కృతజ్ఞతలు మరియు హర్షం వ్యక్తం చేస్తూనే దానికి సంభందించిన విధి విధానాలను మరియు గల్ఫ్ సంక్షేమానికి ఆవిధంగా వినియోగిస్తారో తెలియజేయవలసిందిగా కోరడం జరిగింది. దీనికి స్పందించిన మంత్రివర్యులు ప్రభుత్వం తరపున దీనికి సంబంధించిన విధి విధానాల ప్రకటనను త్వరలోనే విడుదల చేస్తుందని తెలియజేసారు, మరియు తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులు మరియు సంక్షేమం పట్ల సానుకూలంగా ఉందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అద్యక్షులు ఏమూల రమేష్ గారు, సురునిదా అరుణ్ కుమార్, అజయ్ తెడ్డు, దండిగూడెం క్రాంతి కుమార్, నందికంటి చరణ్, మరియు తెలంగాణ ధూమ్ ధామ్ కళాకారులు శ్రీ మారంపల్లి రవీందర్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







