ఫిలిప్పీన్స్ లో దారుణం
- March 17, 2018
మనీలా: ఫిలిప్పీన్స్లో ఓ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ ఇంట్లోకి దూసుకుపోయింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురితోపాటు మరో ఐదుగురు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. పీపర్–23 అపాచీ విమానం బులాకన్ ప్రావిన్స్లోని ప్లారిడెల్ పట్టణంలో విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఇంటిని ఢీకొంది. దీంతో విమానం పేలి.. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
ఆరుగురు ప్రయాణించే ఈ విమానంలో ప్రమాద సమయంలో ఐదుగురు ఉన్నారు. వీరితోపాటు మరో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వివరించారు. ఇంట్లోకి దూసుకెళ్లడానికి ముందు చెట్టును, విద్యుత్ స్తంభాన్ని విమానం ఢీకొట్టిందని ప్రత్యక్షసాక్షులు ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









