తెలుగు రాష్ట్రాల్లో పంచాంగం ఒక్కటే:కేసీఆర్
- March 18, 2018
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పంచాంగాలన్నీ ఒకే విధంగా ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పంచాంగాలన్నీ ఎప్పుడూ తప్పు చెప్పవని.. కాకపోతే పరిస్థితులకు తగ్గట్లు ఎవరి స్టైల్లో వారు చమత్కారంగా, గంభీరంగా, హెచ్చరికగా పండితులు చెబుతుంటారని అన్నారు. ఆదివారం ఉగాది పర్వదినాన ప్రగతి భవన్లో పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. భారత సంస్కృతి మనకు అందించిన గొప్ప శాస్త్ర పరిజ్ఞానం పంచాంగం అని పేర్కొన్నారు. పంచాంగంతో 50 ఏళ్ల తరువాత సంభవించే గ్రహణాన్ని కూడా చెప్పవచ్చు అన్నారు. ఈ ఏడాది తెలంగాణ అద్భుత విజయాలతో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







