తెలుగు రాష్ట్రాల్లో పంచాంగం ఒక్కటే:కేసీఆర్
- March 18, 2018
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పంచాంగాలన్నీ ఒకే విధంగా ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పంచాంగాలన్నీ ఎప్పుడూ తప్పు చెప్పవని.. కాకపోతే పరిస్థితులకు తగ్గట్లు ఎవరి స్టైల్లో వారు చమత్కారంగా, గంభీరంగా, హెచ్చరికగా పండితులు చెబుతుంటారని అన్నారు. ఆదివారం ఉగాది పర్వదినాన ప్రగతి భవన్లో పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. భారత సంస్కృతి మనకు అందించిన గొప్ప శాస్త్ర పరిజ్ఞానం పంచాంగం అని పేర్కొన్నారు. పంచాంగంతో 50 ఏళ్ల తరువాత సంభవించే గ్రహణాన్ని కూడా చెప్పవచ్చు అన్నారు. ఈ ఏడాది తెలంగాణ అద్భుత విజయాలతో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







