తెలుగు రాష్ట్రాల్లో పంచాంగం ఒక్కటే:కేసీఆర్
- March 18, 2018
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పంచాంగాలన్నీ ఒకే విధంగా ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పంచాంగాలన్నీ ఎప్పుడూ తప్పు చెప్పవని.. కాకపోతే పరిస్థితులకు తగ్గట్లు ఎవరి స్టైల్లో వారు చమత్కారంగా, గంభీరంగా, హెచ్చరికగా పండితులు చెబుతుంటారని అన్నారు. ఆదివారం ఉగాది పర్వదినాన ప్రగతి భవన్లో పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. భారత సంస్కృతి మనకు అందించిన గొప్ప శాస్త్ర పరిజ్ఞానం పంచాంగం అని పేర్కొన్నారు. పంచాంగంతో 50 ఏళ్ల తరువాత సంభవించే గ్రహణాన్ని కూడా చెప్పవచ్చు అన్నారు. ఈ ఏడాది తెలంగాణ అద్భుత విజయాలతో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట