తెలుగు రాష్ట్రాల్లో పంచాంగం ఒక్కటే:కేసీఆర్
- March 18, 2018
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పంచాంగాలన్నీ ఒకే విధంగా ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పంచాంగాలన్నీ ఎప్పుడూ తప్పు చెప్పవని.. కాకపోతే పరిస్థితులకు తగ్గట్లు ఎవరి స్టైల్లో వారు చమత్కారంగా, గంభీరంగా, హెచ్చరికగా పండితులు చెబుతుంటారని అన్నారు. ఆదివారం ఉగాది పర్వదినాన ప్రగతి భవన్లో పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. భారత సంస్కృతి మనకు అందించిన గొప్ప శాస్త్ర పరిజ్ఞానం పంచాంగం అని పేర్కొన్నారు. పంచాంగంతో 50 ఏళ్ల తరువాత సంభవించే గ్రహణాన్ని కూడా చెప్పవచ్చు అన్నారు. ఈ ఏడాది తెలంగాణ అద్భుత విజయాలతో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









