కుర్దు ప్రాంతాలపై టర్కీ సైన్యం దాడులు
- March 18, 2018ఆఫ్రిన్ : సిరియాలోని కుర్దు ప్రాబల్య ప్రాంతాలపై టర్కీ సైన్యం దాడుల్ని తీవ్రతరం చేసింది. ఆఫ్రిన్ నగరంలో టర్కీ సేనలు పాగా వేశాయి. టర్కీ సైన్యం అండదండలతో సిరియాలో పోరాటం సాగిస్తున్న ప్రయివేటు సేనలు ఈ నగరంలోని కుర్దులను వెళ్లగొడుతున్నాయి. అనంతరం ప్రముఖ కుర్దు నాయకుడి విగ్రహాన్ని సేనలు నేలకూల్చాయి. తమ దేశ సరిహద్దుల్లో ఉన్న కుర్దిష్ మిలిటెంట్లను అంతమొందించేందుకు గత రెండు నెలలుగా సిరియాలో దాడులు జరుపుతున్నామని టర్కీ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.
అయితే, ఈ దాడుల్లో ఇప్పటివరకూ 280 సాధారణ పౌరులు మరణించారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా ఆ ఆరోపణలను టర్కీ ఖండించింది. దీనికంటే ముందు, 'ఫ్రీ సిరియా ఆర్మీ' సేనలు ఆఫ్రిన్ నగరాన్ని ఆదివారం ఉదయం స్వాధీనం చేసుకున్నాయని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రకటించారు. సేనల దెబ్బకు ఉగ్రవాదులు ఒట్టి చేతులతో పారిపోతున్నారని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం