కుర్దు ప్రాంతాలపై టర్కీ సైన్యం దాడులు
- March 18, 2018
ఆఫ్రిన్ : సిరియాలోని కుర్దు ప్రాబల్య ప్రాంతాలపై టర్కీ సైన్యం దాడుల్ని తీవ్రతరం చేసింది. ఆఫ్రిన్ నగరంలో టర్కీ సేనలు పాగా వేశాయి. టర్కీ సైన్యం అండదండలతో సిరియాలో పోరాటం సాగిస్తున్న ప్రయివేటు సేనలు ఈ నగరంలోని కుర్దులను వెళ్లగొడుతున్నాయి. అనంతరం ప్రముఖ కుర్దు నాయకుడి విగ్రహాన్ని సేనలు నేలకూల్చాయి. తమ దేశ సరిహద్దుల్లో ఉన్న కుర్దిష్ మిలిటెంట్లను అంతమొందించేందుకు గత రెండు నెలలుగా సిరియాలో దాడులు జరుపుతున్నామని టర్కీ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.
అయితే, ఈ దాడుల్లో ఇప్పటివరకూ 280 సాధారణ పౌరులు మరణించారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా ఆ ఆరోపణలను టర్కీ ఖండించింది. దీనికంటే ముందు, 'ఫ్రీ సిరియా ఆర్మీ' సేనలు ఆఫ్రిన్ నగరాన్ని ఆదివారం ఉదయం స్వాధీనం చేసుకున్నాయని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రకటించారు. సేనల దెబ్బకు ఉగ్రవాదులు ఒట్టి చేతులతో పారిపోతున్నారని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







