"బృందావనమది అందరిది" టీజర్ విడుదల
- March 19, 2018
జస్ట్ ఎంటరర్ టైన్ మెంట్ క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ తేజ డైమండ్స్ సికింద్రాబాద్ అధినేత శ్రీనివాస్ వంగల మరియు ప్రభాకర్ రెడ్డి కూతురు (యన్. అర్. ఐ ) నిర్మాతలుగా సక్సెస్ ఫుల్ రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "బృందావనమది అందరిది". ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని సెంపుల్ వీడియో విడుదల చేశారు ఈ సందర్బంగా దర్శకుడు శ్రీధర్ సీపాన మాట్లాడుతూ చిత్రం వైజాగ్ లో సినిమా గురించి వైజాగ్ సాగర తీరం లో వేయించిన హీరోయిన్ హోమ్ సెట్ సన్నివేశాలు వైజాగ్ పరిసర ప్రాంతాలలో రిచా పణయ్ హర్షవర్ధన్ రానే ఎంపీ శివ ప్రసాద్ హీరా సాహిలి బెనర్జి తాగుబోతు రమేష్ భద్రం లతో కీలక సన్నివేశాలు చిత్రీకరించము ఫస్ట్ టైమ్ డైరెక్టర్ అని అటువంటి భయం నాపైన పడకుండా మా టెక్నిషియన్స్ అండ్ ఆర్టిస్ట్స్ లకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఔట్ ఫుట్ చాలా బాగా వస్తుంది నాకు ఫుల్ వర్క్ సాడిస్పెక్షన్ అనిపించింది మా ఫస్ట్ షెడ్యూల్ మేకింగ్ అండ్ సెంపుల్ వీడియో టీజర్ ని మన తెలుగు కొత్త సంవత్సరం లో విడుదల చేసాము ఫ్రెండ్స్ నుండి పెద్ద హీరోలనుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ రెస్పాన్స్ నాకు మరింత ధైర్యాన్నిచ్చింది. మిగతా షెడ్యూల్ ఏప్రిల్1 నుండి బెంగళూర్ లో 7డేస్ తరువాత షెడ్యూల్ హైదరాబాద్ లో జరుపుకుంటుంది అని ఈ చిత్ర దర్శకుడు శ్రీధర్ సీపాన తెలిపారు.
ఆర్టిస్ట్స్: రిచా పణయ్, హర్షవర్ధన్ రానే, లగడపాటి విక్రమ్ (రేసుగుర్రం ఫేమ్), పృద్వి (30 ఇయర్స్ ఇండస్ట్రీ), ఎం.పీ శివ ప్రసాద్, హీరా సాహిలి, బెనర్జి, తాగుబోతు రమేష్, భద్రం, ఆదుర్స్ రఘు, బొడ్డ నారాయణ, సత్యం రాజేష్, జూనియర్ రామిరెడ్డి, రజిత.
టెక్నిషియన్స్:
సంగీతం : మణిశర్మ
కెమెరా : తమ్మ శ్యామ్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
పి.ఆర్. ఓ. కడలి రాంబాబు
పాటలు : సిరివెన్నెల సీతారామశాస్త్రి.
ప్రొడక్షన్ ఎక్సుక్యూటివ్
నాగమధు.గిద్దలూరు
నిర్మాతలు :
శ్రీనివాస్ వంగాల
ప్రభాకర్ రెడ్డి కూతురు
రచన దర్శకత్వం : శ్రీధర్ సీపాన
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







