గడువు తీరిన కేక్ అమ్మకం: ముగ్గురి అరెస్ట్
- March 22, 2018
మస్కట్: ఇజ్కి లోని ఓ స్కూల్లో విద్యార్థులకు గడువు తీరిన కేక్లను విక్రయించినందుకుగాను ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ వెల్లడించింది. ఇందులో ఇద్దరికి 2,000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించగా, మరో వ్యక్తికి 200 ఒమన్ రియాల్స్ జరీమానా విధించారు. కన్స్యుమర్ ప్రొటెక్షన్ చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. విక్రయించిన కేకులపై లేబుల్స్ని టాంపరింగ్ చేయడం, గడువు తీరిన కేక్లను విక్రయించడం ద్వారా నిందితులు చట్టాన్ని ఉల్లంఘించి, నేరానికి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇజ్కి స్కూల్ నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. క్యాంటీన్లో అమ్మకందారులు, 'గడువు' పేర్కొనకపోవడం, కొన్ని కేక్లపై స్టిక్కర్స్ లేకుండా, 'గడువు' ట్యాంపరింగ్ చేయడం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు అధికారులకు ఇజ్కి స్కూల్ ఫిర్యాదు చేసింది.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









