వియత్నాంలోని హో చి మిన్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం..13 మంది మృతి
- March 22, 2018
హానోయ్ : వియత్నాంలోని హో చి మిన్ నగరంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ నివాస సముదాయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి సుమారు 13 మంది మృతిచెందారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగిన మూడు బిల్డింగ్లలో సుమారు 700 ల అపార్టుమెంట్లు ఉన్నాయని, వీటిని 6 సంవత్సరాల క్రితమే నిర్మించారని అధికారులు తెలిపారు. అయితే ఎంత మంది మంటల్లో చిక్కుకున్నదనే విషయం, ప్రమాదానికి గల కారణాలు అధికారులు తెలియజేసేందుకు నిరాకరిస్తున్నారు.
చాలా మంది ప్రజలు గందరగోళంలో భవనంపై నుంచి దూకడం వల్ల చనిపోయారని స్థానికులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం కింద ఫ్లోర్లో చోటుచేసుకోవడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువైందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదస్థలంలో సుమారు 200 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వియత్నాంలో 2002 సంవత్సరంలో జరిగిన అగ్నిప్రమాదంలో 60 మంది ప్రజలు చనిపోయారు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









