చిన్నారి మృతి: స్విమ్మింగ్‌ పూల్‌ కూల్చివేత

- March 23, 2018 , by Maagulf
చిన్నారి మృతి: స్విమ్మింగ్‌ పూల్‌ కూల్చివేత

మనామా: సదరన్‌ ఏరియా మునిసిపాలిటీ, దర్‌ కులైబ్‌ విలేజ్‌లో గల స్విమ్మింగ్‌ పూల్‌ని కూల్చివేసింది. ఇటీవల ఐదేళ్ళ చిన్నారి ఈ మూసివేయబడ్డ స్విమ్మింగ్‌ పూల్‌లో పడి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ కూల్చివేతను అమలు చేశారు. నీటిని తోడేసి, కూల్చివేస్తున్నామనీ, పూర్తిగా స్విమ్మింగ్‌ పూల్‌ని మట్టితో నింపేస్తామని, పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ పనులు చేస్తున్నామని ఆసియాకి చెందిన ఫోర్‌మెన్‌ ఒకరు చెప్పారు. గవర్నమెంట్‌ హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ నివాసితుడు మొహమ్మద్‌ మాట్లాడుతూ, కొన్నేళ్ళుగా ఈ పూల్‌ మూసివేసి వుందనీ, చట్టపరమైన సమస్యలే అందుకు కారణమని, కూల్చివేత మంచిదేనని అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com