చిన్నారి మృతి: స్విమ్మింగ్ పూల్ కూల్చివేత
- March 23, 2018
మనామా: సదరన్ ఏరియా మునిసిపాలిటీ, దర్ కులైబ్ విలేజ్లో గల స్విమ్మింగ్ పూల్ని కూల్చివేసింది. ఇటీవల ఐదేళ్ళ చిన్నారి ఈ మూసివేయబడ్డ స్విమ్మింగ్ పూల్లో పడి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ కూల్చివేతను అమలు చేశారు. నీటిని తోడేసి, కూల్చివేస్తున్నామనీ, పూర్తిగా స్విమ్మింగ్ పూల్ని మట్టితో నింపేస్తామని, పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ పనులు చేస్తున్నామని ఆసియాకి చెందిన ఫోర్మెన్ ఒకరు చెప్పారు. గవర్నమెంట్ హౌసింగ్ ప్రాజెక్ట్ నివాసితుడు మొహమ్మద్ మాట్లాడుతూ, కొన్నేళ్ళుగా ఈ పూల్ మూసివేసి వుందనీ, చట్టపరమైన సమస్యలే అందుకు కారణమని, కూల్చివేత మంచిదేనని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







