31న గన్నవరం వద్ద అశోక్ లేలాండ్ పార్క్ శంకుస్థాపన
- March 26, 2018
విజయవాడ దగ్గరలోని మల్లవల్లి వద్ద మోడల్ ఇండస్ర్టియల్ పార్క్ లో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 1260.06 ఎకరాల సువిశాల భారీ మోడల్ ఇండస్ర్టియల్ పార్క్లో 964 ప్లాట్లు ఉండగా, కేటాయింపులకు ముందే హౌస్ఫుల్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడే అశోక్ లేల్యాండ్ కంపెనీ దక్షిణ భారత స్థాయిలో వెహికల్ బాడీ బిల్డింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తుంది. మరో పక్క ఇదే ఇండస్ర్టియల్ పార్క్ లో, మోహన్ స్పిన్టెక్స్ సంస్థకు ఇంటిగ్రేటెడ్ మెగా టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటుకు 81 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.. భారీ పరిశ్రమల కేటగిరిలో ఇవి పోను గోల్డ్ ప్రాసెసింగ్ యూనిట్తో పాటు అనేక స్పి న్నింగ్ మిల్లులు, ఫార్మా కంపె నీలు ఆసక్తి చూపి స్తున్నాయి.అయితే ఈ భారీ కంపనీల్లో ముందుగా, ప్రముఖ రవాణా వాహనాల తయారీ సంస్థ అశోక్ లేల్యాండ్ అమరావతిలో తమ యూనిట్ నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేసింది. రాజధాని పరిధిలో ప్రతిష్టాత్మక పారిశ్రామికవాడగా భావిస్తున్న కృష్ణా జిల్లా మల్లవల్లిలో బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ స్థాపనకు కార్యాచరణ ప్రారంభించింది. ఈనెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి భూమిపూజ చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఏపీఐఐసీ వర్గాలకు సీఎంవో, అశోక్ లేల్యాండ్ నుంచి సమాచారం అందింది. ఇప్పటికే అశోక్ లేల్యాండ్ సంస్థకు ఏపీఐఐసీ 15 ఎకరాలు కేటాయించింది. ఎకరం రూ. 16. 50 లక్షల చొప్పున ధర చెల్లించి 15 రోజుల కిందట భూమిని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది. కేటాయించిన భూమిలో మౌలిక వసతుల కల్పన, నిర్మాణాలకు వీలుగా భూమి చదును చేయిస్తున్నారు.చెన్నైకి చెందిన సంస్థ ద్వారా మట్టి సామర్థ్య పరీక్షలు చేయిస్తున్నారు. ఇక్కడ నెలకొల్పే యూనిట్లో ఏడాదికి 4,800 చొప్పున బస్సు బాడీ బిల్డింగ్ రూపొందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. తర్వాత విడతలో ఛాసిస్లు తయారుచేసే యూనిట్ ను నెలకొల్పవచ్చని సమాచారం. అశోక్ లేలాండ్ సంస్థ ఇక్కడ రూ.135 కోట్ల వ్యయంతో బస్బాడీ బిల్డింగ్ యూనిట్ను ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా స్థానికంగా 2,295 మందికి ఉపాధిని ఈ సంస్థ కల్పించనుంది..
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









