తెలుగు మాట్లాడితే జీతం కట్..!
- March 26, 2018
స్కూల్ ఆవరణలో తెలుగు మాట్లాడితే వేతనం కట్ చేస్తామంటూ కరీంనగర్ జిల్లాలో మెమో జారీ అయింది. గురుకుల స్కూళ్లు, ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు, విద్యార్థులతో మొత్తంగా ఇంగ్లీష్లోనే మాట్లాడాలంటూ నోటీసులు జారీ చేశారు. అది కూడా బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడితే కుదరదు. ఫ్లూయెంట్గా ఉంటేనే వేతనం వస్తుంది. ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేని వారు సెలవుపై వెళ్లాలని, లేదంటే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లాలంటూ ఉపాధ్యాయాలను హెచ్చరించారు ఉన్నతాధికారులు. ఈ మేరకు లిఖిత పూర్వక ఆదేశాలు వెలువడడం కలకలం సృష్టిస్తోంది.
ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెంచడానికి, పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికే ఇలాంటి నోటీసు ఇవ్వాల్సి వచ్చిందంటూ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ నోటీసుతో ఇంగ్లీష్ అంతంత మాత్రం వచ్చిన టీచర్లు భయపడిపోతున్నారు. రీజినల్ కో ఆర్డినేటర్లు స్కూళ్లలో తనిఖీలకు వస్తున్నారంటేనే వణికిపోతున్నారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







