ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- June 19, 2026
పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు గండికొడుతూ అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి(Strait Of Hormuz)ని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగడం, గల్ఫ్ ప్రాంతంలో అమెరికా బలగాల ఉనికిని నిరసిస్తూ ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలోని కీలక షరతులు అమలయ్యే వరకు ఈ దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేసింది. వాణిజ్య నౌకలు, చమురు ట్యాంకర్లు తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ తీవ్రస్థాయిలో హెచ్చరించింది.
ఈ తాజా పరిణామం వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతల తగ్గింపు ప్రక్రియకు పెద్ద సవాలుగా మారింది. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వైదొలగడం, సముద్ర దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు పర్షియన్ గల్ఫ్ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవడమే తమ ప్రధాన షరతులని ఇరాన్ పేర్కొంటోంది. అయితే అమెరికా-ఇరాన్ ఒప్పందాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇజ్రాయెల్ తేల్చిచెప్పింది. దక్షిణ లెబనాన్లోని హిజ్బుల్లాను అంతం చేయడమే తమ ఏకైక లక్ష్యమని ఇజ్రాయెల్ స్పష్టం చేయడంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం మరింత క్లిష్టంగా మారింది.
అమెరికా-ఇరాన్ చర్చల తర్వాత హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న తరుణంలో ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్జాతీయ చమురు సరఫరాలో అత్యధిక భాగం ఈ జలసంధి గుండానే సాగుతుండటంతో, గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లలో మళ్లీ అలజడి మొదలైంది. ఈ సముద్ర మార్గం మూతపడటం వల్ల రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్
- యెమెన్ సముద్ర జలాల్లో మునిగిన భారత కార్గో నౌక..
- 18 ఏళ్లకే గిన్నిస్ రికార్డు సృష్టించిన యువ ప్రొఫెసర్ నాథన్ థామస్
- గుజరాత్లో విజృంభిస్తున్న చాందీపురా వైరస్
- ఇక ఇంటింటికీ ఇంటర్నెట్.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..







