రాజమౌళి మీద ఉన్న నమ్మకంతోనే ఆ పని చేశా - రామ్ చరణ్
- March 26, 2018
బాహుబలి తర్వాత రాజమౌళి ఆ అంచనాలను మించేలా మెగా నందమూరి మల్టీస్టారర్ కు సిద్ధం అవుతున్నాడు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో కలిసి రాజమౌళి చేయబోతున్న ఈ మూవీ ట్రిపుల్ ఆర్ అంటూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ ను రామారావుగా సంభోదించడం రాజమౌళి గట్స్ కు నిదర్శనం అని చెప్పొచ్చు.
డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా కథ ఇంకా తాను వినలేదని షాక్ ఇచ్చాడు చరణ్. కేవలం రాజమౌళి మీద ఉన్న నమ్మకంతోనే కథ వినకుండా కాంబినేషన్ కు సై అన్నాడని అంటున్నాడు. అయితే కథ మొత్తం వినలేదు కాని కచ్చితంగా ఇది లైన్ అని జక్కన్న చెప్పే ఉంటాడని అంటున్నారు.
ప్రస్తుతం మరో మూడు రోజుల్లో రిలీజ్ అవబోతున్న రంగస్థలం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రాం చరణ్ రాజమౌళి సినిమా గురించి షాకింగ్ కామెంట్ చేశాడు. కేవలం రాజమౌళి మీద ఉన్న కాన్ఫిడెంట్ మీదే ఈ మెగా మల్టీస్టారర్ కు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే కథ వినకుండా ఓకే చేసినందుకు మెగా ఫ్యాన్స్ మాత్రం కొంత అసహనంలో ఉన్నారు.
రంగస్థలం తర్వాత బోయపాటి శ్రీను సినిమా చేస్తున్న రాం చరణ్ ఆ సినిమా బోయపాటి మార్క్ మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో వస్తుందని తెలుస్తుంది. తప్పకుండా 2018, 19 ఇయర్ లలో చెర్రి తన స్టామినా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉందని అతను చేస్తున్న సినిమాలను బట్టే చెప్పేయొచ్చు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









