రాజమౌళి మీద ఉన్న నమ్మకంతోనే ఆ పని చేశా - రామ్ చరణ్
- March 26, 2018
బాహుబలి తర్వాత రాజమౌళి ఆ అంచనాలను మించేలా మెగా నందమూరి మల్టీస్టారర్ కు సిద్ధం అవుతున్నాడు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో కలిసి రాజమౌళి చేయబోతున్న ఈ మూవీ ట్రిపుల్ ఆర్ అంటూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ ను రామారావుగా సంభోదించడం రాజమౌళి గట్స్ కు నిదర్శనం అని చెప్పొచ్చు.
డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా కథ ఇంకా తాను వినలేదని షాక్ ఇచ్చాడు చరణ్. కేవలం రాజమౌళి మీద ఉన్న నమ్మకంతోనే కథ వినకుండా కాంబినేషన్ కు సై అన్నాడని అంటున్నాడు. అయితే కథ మొత్తం వినలేదు కాని కచ్చితంగా ఇది లైన్ అని జక్కన్న చెప్పే ఉంటాడని అంటున్నారు.
ప్రస్తుతం మరో మూడు రోజుల్లో రిలీజ్ అవబోతున్న రంగస్థలం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రాం చరణ్ రాజమౌళి సినిమా గురించి షాకింగ్ కామెంట్ చేశాడు. కేవలం రాజమౌళి మీద ఉన్న కాన్ఫిడెంట్ మీదే ఈ మెగా మల్టీస్టారర్ కు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే కథ వినకుండా ఓకే చేసినందుకు మెగా ఫ్యాన్స్ మాత్రం కొంత అసహనంలో ఉన్నారు.
రంగస్థలం తర్వాత బోయపాటి శ్రీను సినిమా చేస్తున్న రాం చరణ్ ఆ సినిమా బోయపాటి మార్క్ మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో వస్తుందని తెలుస్తుంది. తప్పకుండా 2018, 19 ఇయర్ లలో చెర్రి తన స్టామినా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉందని అతను చేస్తున్న సినిమాలను బట్టే చెప్పేయొచ్చు.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









