మార్చి 29న 'ఎన్టీఆర్ బయోపిక్' ప్రారంభం

- March 26, 2018 , by Maagulf
మార్చి 29న 'ఎన్టీఆర్ బయోపిక్' ప్రారంభం

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామరావు బయోపిక్‌ని బాలయ్య ప్రధాన పాత్రలో తేజ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి దర్శకుడు తేజ తన ఫేస్ బుక్‌లో ఫ్యాన్స్‌కి మంచి శుభవార్త అందించాడు. నాచారంలోని రామకృష్ణ స్టూడియోస్‌లో మార్చి 29 ఉదయం 9.30 గంటలకు చిత్ర ప్రారంభోత్సవ వేడుకను నిర్వహించనున్నట్టు డైరెక్టర్ తేజ తెలిపారు. ఎన్టీఆర్ అభిమానులందరికి స్వాగతం అని అన్నాడు. సాయి కొర్రపాటి మరియు విష్ణు వర్ధన్ ఇందూరి సంయుక్తంగా నిర్మించనున్న ఎన్టీఆర్ బయోపిక్‌పై ప్రతి ఒక్కరిలోను ఎంతో ఆసక్తి నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com