భారత్కు చేరుకోనున్న 38 మంది మృతదేహాలు
- April 01, 2018
న్యూఢిల్లీ : ఇరాక్లోని మోసుల్లో మృతి చెందిన 39 మంది భారతీయుల్లో 38 మంది మృతదేహాలు సోమవారం రాత్రికి భారత్కు చేరుకోవచ్చు. వీటిని ఇక్కడకు తరలించడానికి విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.కె. సింగ్ ఆదివారం మోసుల్ చేరుకున్నారు. మృతి చెందిన వారిలో ఓ వ్యక్తి కేసు పెండింగ్లో ఉండటం వల్ల అతని మృతదేహాన్ని తీసుకురావడం లేదని తెలిపారు. మృతదేహాలు భారత్కు చేరుకున్న అనంతరం అమృత్సర్, పాట్నాలో ఉన్న బాధితుల కుటుంబ సభ్యులకు ఇవ్వనున్నారు. ఇరాక్లో తప్పిపోయిన 39 భారతీయుల్ని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ హత్య చేసిన సంఘటనపై గతనెల 20న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









