భారత్‌కు చేరుకోనున్న 38 మంది మృతదేహాలు

- April 01, 2018 , by Maagulf
భారత్‌కు చేరుకోనున్న 38 మంది మృతదేహాలు

న్యూఢిల్లీ : ఇరాక్‌లోని మోసుల్‌లో మృతి చెందిన 39 మంది భారతీయుల్లో 38 మంది మృతదేహాలు సోమవారం రాత్రికి భారత్‌కు చేరుకోవచ్చు. వీటిని ఇక్కడకు తరలించడానికి విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.కె. సింగ్‌ ఆదివారం మోసుల్‌ చేరుకున్నారు. మృతి చెందిన వారిలో ఓ వ్యక్తి కేసు పెండింగ్‌లో ఉండటం వల్ల అతని మృతదేహాన్ని తీసుకురావడం లేదని తెలిపారు. మృతదేహాలు భారత్‌కు చేరుకున్న అనంతరం అమృత్‌సర్‌, పాట్నాలో ఉన్న బాధితుల కుటుంబ సభ్యులకు ఇవ్వనున్నారు. ఇరాక్‌లో తప్పిపోయిన 39 భారతీయుల్ని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ హత్య చేసిన సంఘటనపై గతనెల 20న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ రాజ్యసభలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com