రక్తసిక్తమైన నిశ్చితార్థ వేడుక.. కత్తులతో దాడి చేసి..
- April 01, 2018
హైదరాబాద్ పాతబస్తీలో నిశ్చితార్థం వేడుక రక్తసిక్తమైంది. భోజనంపై మొదలైన గొడవ హత్యకు దారితీసింది. హుస్సేనీఆలం షాగంజ్ తరిఖత్ మంజిల్ ఫంక్షన్ హాల్లో ఈ దారుణం జరిగింది. రౌడీమూకలు రెచ్చిపోవడంతో పెళ్లికొచ్చిన బంధువులంతా షాక్ అయ్యారు. ప్రాణ భయంతో పరుగులుతీశారు.
పాతబస్తీలో షేక్ ఇమాం తన కుమార్తె నిశ్చితార్థం వేడుకల్ని షాగంజ్ తరిఖత్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశాడు. రాత్రి బంధువులంతా హాజరై సందడిగా ఉన్న సమయంలో.. మద్యం మత్తులో ఉన్న అష్వాక్ అనే వ్యక్తి భోజనం సరిగా వడ్డించలేదంటూ కేటరింగ్ వారిని అరిచాడు. అడ్డుకున్న పెళ్లివారితో గొడవకు దిగాడు. బయటకు వెళ్లిన అష్వాక్ కాసేపటికే 20 మందితో ఫంక్షన్ హాల్కు తిరిగొచ్చాడు. రక్తపాతం సృష్టించాడు.
అష్వాక్తోపాడూ ఫంక్షన్హాల్లోకి వచ్చిన 20 మంది లోపలున్న కుర్చీలు, టేబుళ్లు విసిరేసి వీరంగం సృష్టించారు. వంటసామాన్లన్నీ చిందరవందర చేశారు. అడ్డుకోడానికి ప్రయత్నించిన మహ్మద్ అన్వర్ అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సోహెల్ అనే మరో వ్యక్తిపై కూడా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్వర్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామంటున్నారు. సోహెల్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పెళ్లికి వచ్చిన వారంతా ఉస్మానియా ఆస్పత్రికి తరలిరావడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









