కువైట్లో బస్సు ప్రమాదం 15 మంది మృతి
- April 02, 2018
కువైట్ సిటీ: రెండు బస్సులు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. కువైట్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టరేట్ (కెఎఫ్ఎస్డి) ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఒకరు కువైటీ పౌరుడు. అల్ అర్తాల్ రోడ్లో ఏడవ రింగ్ రోడ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఫైర్ ఫైటర్స్ వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నప్పటికీ, ప్రమాద తీవ్రత నేపథ్యంలో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరికి అత్యవసర పరిస్థితి నేపథ్యంలో హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించడం జరిగింది. బుర్గాన్ ఆయిల్ ఫీల్డ్లో పనిచేసే కార్మికుల్ని తరలించేందుకు ఈ బస్సుల్ని కాంట్రాక్టింగ్ ఫర్మ్ తరలించిందని కువైట్ ఆయిల్ కంపెనీ (కెఓసి) వెల్లడించింది. మెడికల్ ఎమర్జన్సీ టీమ్స్ సకాలంలో స్పందించాయని కెఓసి పేర్కొంది. మృతుల్లో ఏడుగురు భారతీయులు కాగా, ఐదుగురు ఈజిప్టియన్లు, ముగ్గురు పాకిస్తానీలు వున్నారు. గాయపడ్డవారిలో ఒకరు ఇండియన్ కాగా, మరొకరు కువైటీ.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







