కువైట్లో బస్సు ప్రమాదం 15 మంది మృతి
- April 02, 2018
కువైట్ సిటీ: రెండు బస్సులు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. కువైట్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టరేట్ (కెఎఫ్ఎస్డి) ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఒకరు కువైటీ పౌరుడు. అల్ అర్తాల్ రోడ్లో ఏడవ రింగ్ రోడ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఫైర్ ఫైటర్స్ వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నప్పటికీ, ప్రమాద తీవ్రత నేపథ్యంలో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరికి అత్యవసర పరిస్థితి నేపథ్యంలో హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించడం జరిగింది. బుర్గాన్ ఆయిల్ ఫీల్డ్లో పనిచేసే కార్మికుల్ని తరలించేందుకు ఈ బస్సుల్ని కాంట్రాక్టింగ్ ఫర్మ్ తరలించిందని కువైట్ ఆయిల్ కంపెనీ (కెఓసి) వెల్లడించింది. మెడికల్ ఎమర్జన్సీ టీమ్స్ సకాలంలో స్పందించాయని కెఓసి పేర్కొంది. మృతుల్లో ఏడుగురు భారతీయులు కాగా, ఐదుగురు ఈజిప్టియన్లు, ముగ్గురు పాకిస్తానీలు వున్నారు. గాయపడ్డవారిలో ఒకరు ఇండియన్ కాగా, మరొకరు కువైటీ.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









