కువైట్లో బస్సు ప్రమాదం 15 మంది మృతి
- April 02, 2018
కువైట్ సిటీ: రెండు బస్సులు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. కువైట్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టరేట్ (కెఎఫ్ఎస్డి) ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఒకరు కువైటీ పౌరుడు. అల్ అర్తాల్ రోడ్లో ఏడవ రింగ్ రోడ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఫైర్ ఫైటర్స్ వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నప్పటికీ, ప్రమాద తీవ్రత నేపథ్యంలో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరికి అత్యవసర పరిస్థితి నేపథ్యంలో హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించడం జరిగింది. బుర్గాన్ ఆయిల్ ఫీల్డ్లో పనిచేసే కార్మికుల్ని తరలించేందుకు ఈ బస్సుల్ని కాంట్రాక్టింగ్ ఫర్మ్ తరలించిందని కువైట్ ఆయిల్ కంపెనీ (కెఓసి) వెల్లడించింది. మెడికల్ ఎమర్జన్సీ టీమ్స్ సకాలంలో స్పందించాయని కెఓసి పేర్కొంది. మృతుల్లో ఏడుగురు భారతీయులు కాగా, ఐదుగురు ఈజిప్టియన్లు, ముగ్గురు పాకిస్తానీలు వున్నారు. గాయపడ్డవారిలో ఒకరు ఇండియన్ కాగా, మరొకరు కువైటీ.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









