అమృత్సర్ చేరుకున్న ఆ మృతదేహాలు
- April 02, 2018
అమృత్సర్: ఇరాక్లోని మోసుల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చేతుల్లో హతమైన 39 మంది భారతీయుల మృతదేహాలు ఇవాళ భారత్కు చేరుకున్నాయి. పంజాబ్లోని అమృత్సర్లో కాసేపటి క్రితం మృతదేహాలతో వచ్చిన విమానం ల్యాండైంది. అయితే మోసుల్లో మృతిచెందిన వారి బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలా వద్దా అన్న అంశాన్ని కేంద్రం చర్చిస్తోందని మంత్రి వీకే సింగ్ తెలిపారు. ఆ మృతులకు ఎటువంటి నష్టపరిహారం చెల్లిస్తారన్న అంశాన్ని కూడా తేల్చనున్నట్లు మంత్రి చెప్పారు. ఇరాక్లోని మొసుల్లో సుమారు 40 మంది భారతీయులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జూన్ 11, 2014లో కిడ్నాప్ చేసింది. అందులో ఒకరు తప్పించుకున్నారు. మిగతా 39 మందిని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చంపేసినట్లు ఇటీవల లోక్సభలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు ఒకరికి 5 లక్షలు ఇవ్వనున్నట్లు పంజాబా్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ తెలిపారు. ఒక వ్యక్తికి ఉద్యోగంతో పాటు ఆ ఫ్యామిలీకి 20 వేల పెన్షన్ ఇవ్వనున్నట్లు సిద్ధూ చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









