రూ.6వేల కోట్లకి టీం ఇండియా క్రికెట్ రైట్స్ అమ్మకం!
- April 05, 2018
ముంబై: టీం ఇండియా ఆడనున్న క్రికెట్ మ్యాచ్లను టెలివిజన్, డిజిటల్ మాద్యమాల్లో ప్రసారం చేసే హక్కులను భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. దీని కోసం తొలిసారిగా బీసీసీఐ ఆన్లైన్లో వేలం నిర్వహించింది. ఈ వేలంలో సోనీ స్పోర్ట్స్, స్టార్ ఇండియా, రిలయన్స్ సంస్థలు పాల్గొన్నాయి. అయితే ఈ వేలంలో ఈ హక్కులను రూ.6,138 కోట్లకు స్టార్ ఇండియా దక్కించుకుంది. 2012 నుంచి 2018 కాలంలో ఈ హక్కులు రూ.3,851 కోట్లకి స్టార్ ఇండియానే కొనుగోలు చేసింది. అయితే 2018 నుంచి 2023 వరకూ ప్రసార హక్కుల కోసం పోటాపోటీగా జరిగిన వేలంలో మరోసారి స్టార్ ఇండియానే ఈ హక్కులు దక్కించుకుంది.ఐదు సంవత్సరాల కాలంలో టీం ఇండియా 104 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది. ఇందులో సీనియర్ల జట్టు మాత్రమే కాకుండా.. మహిళ క్రికెట్ జట్టు ఆడే మ్యాచ్లు కూడా ఉంది. అంటే టీం ఇండియా ఆడే ఒక్కొ మ్యాచ్కి స్టార్ ఇండియా రూ.60.14 కోట్లు వెచ్చింది. 2017లో ఐపీఎల్ ప్రసారం కోసం జరిగిన వేలంలోనూ స్టార్ ఇండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. 2018-2022 వరకూ ఐపీఎల్ హక్కులన్ని సోనీ నుంచి స్టార్ ఇండియా దక్కించుకుంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







