రూ.6వేల కోట్లకి టీం ఇండియా క్రికెట్ రైట్స్ అమ్మకం!
- April 05, 2018
ముంబై: టీం ఇండియా ఆడనున్న క్రికెట్ మ్యాచ్లను టెలివిజన్, డిజిటల్ మాద్యమాల్లో ప్రసారం చేసే హక్కులను భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. దీని కోసం తొలిసారిగా బీసీసీఐ ఆన్లైన్లో వేలం నిర్వహించింది. ఈ వేలంలో సోనీ స్పోర్ట్స్, స్టార్ ఇండియా, రిలయన్స్ సంస్థలు పాల్గొన్నాయి. అయితే ఈ వేలంలో ఈ హక్కులను రూ.6,138 కోట్లకు స్టార్ ఇండియా దక్కించుకుంది. 2012 నుంచి 2018 కాలంలో ఈ హక్కులు రూ.3,851 కోట్లకి స్టార్ ఇండియానే కొనుగోలు చేసింది. అయితే 2018 నుంచి 2023 వరకూ ప్రసార హక్కుల కోసం పోటాపోటీగా జరిగిన వేలంలో మరోసారి స్టార్ ఇండియానే ఈ హక్కులు దక్కించుకుంది.ఐదు సంవత్సరాల కాలంలో టీం ఇండియా 104 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది. ఇందులో సీనియర్ల జట్టు మాత్రమే కాకుండా.. మహిళ క్రికెట్ జట్టు ఆడే మ్యాచ్లు కూడా ఉంది. అంటే టీం ఇండియా ఆడే ఒక్కొ మ్యాచ్కి స్టార్ ఇండియా రూ.60.14 కోట్లు వెచ్చింది. 2017లో ఐపీఎల్ ప్రసారం కోసం జరిగిన వేలంలోనూ స్టార్ ఇండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. 2018-2022 వరకూ ఐపీఎల్ హక్కులన్ని సోనీ నుంచి స్టార్ ఇండియా దక్కించుకుంది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









