రూ.6వేల కోట్లకి టీం ఇండియా క్రికెట్ రైట్స్ అమ్మకం!
- April 05, 2018
ముంబై: టీం ఇండియా ఆడనున్న క్రికెట్ మ్యాచ్లను టెలివిజన్, డిజిటల్ మాద్యమాల్లో ప్రసారం చేసే హక్కులను భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. దీని కోసం తొలిసారిగా బీసీసీఐ ఆన్లైన్లో వేలం నిర్వహించింది. ఈ వేలంలో సోనీ స్పోర్ట్స్, స్టార్ ఇండియా, రిలయన్స్ సంస్థలు పాల్గొన్నాయి. అయితే ఈ వేలంలో ఈ హక్కులను రూ.6,138 కోట్లకు స్టార్ ఇండియా దక్కించుకుంది. 2012 నుంచి 2018 కాలంలో ఈ హక్కులు రూ.3,851 కోట్లకి స్టార్ ఇండియానే కొనుగోలు చేసింది. అయితే 2018 నుంచి 2023 వరకూ ప్రసార హక్కుల కోసం పోటాపోటీగా జరిగిన వేలంలో మరోసారి స్టార్ ఇండియానే ఈ హక్కులు దక్కించుకుంది.ఐదు సంవత్సరాల కాలంలో టీం ఇండియా 104 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది. ఇందులో సీనియర్ల జట్టు మాత్రమే కాకుండా.. మహిళ క్రికెట్ జట్టు ఆడే మ్యాచ్లు కూడా ఉంది. అంటే టీం ఇండియా ఆడే ఒక్కొ మ్యాచ్కి స్టార్ ఇండియా రూ.60.14 కోట్లు వెచ్చింది. 2017లో ఐపీఎల్ ప్రసారం కోసం జరిగిన వేలంలోనూ స్టార్ ఇండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. 2018-2022 వరకూ ఐపీఎల్ హక్కులన్ని సోనీ నుంచి స్టార్ ఇండియా దక్కించుకుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







