బీసిసిఐ భారీ జాక్‌పాట్

- April 05, 2018 , by Maagulf
బీసిసిఐ భారీ జాక్‌పాట్

టీమిండియా ఆడే మ్యాచ్‌ల ప్రసార హక్కుల వేలంలో బీసిసిఐ మరోసారి భారీ జాక్‌పాట్ కొట్టింది. వచ్చే ఐదేళ్ళలో సొంతగడ్డపై భారత్ ఆడనున్న మ్యాచ్‌ల ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ 6138 కోట్లకు దక్కించుకుంది. రెండురోజులుగా సాగిన ఈ వేలంలో స్టార్ నెట్‌వర్క్ రిలయన్స్, సోనీలను వెనక్కి నెట్టింది. దీంతో ఒక్కో మ్యాచ్‌కు సగటున 60 కోట్లు చెల్లించనుంది. గత సీజన్‌లో 3851 కోట్లకు మీడియా రైట్స్ దక్కించుకున్న స్టార్‌ ఈ సారి దాని కంటే 59 శాతం ఎక్కువగా వెచ్చించింది. 2018 నుంచి 2023 వరకూ టీమిండియా 102 మ్యాచ్‌లు ఆడనుండగా... తొలిసారి మీడియా హక్కులు భారీ స్థాయిలో అమ్ముడుపోయాయి. ఇప్పటికే స్టార్ నెట్‌వర్క్ ఐపీఎల్ ప్రసార హక్కులను కూడా 16వేల కోట్లకు పైగా వెచ్చించి దక్కించుకుంది. దీంతో రానున్న ఐదేళ్ళలో కేవసం ప్రసార హక్కుల అమ్మకం ద్వారానే 22 వేల కోట్ల వరకూ బీసిసిఐ ఆర్జించబోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com