బీసిసిఐ భారీ జాక్పాట్
- April 05, 2018
టీమిండియా ఆడే మ్యాచ్ల ప్రసార హక్కుల వేలంలో బీసిసిఐ మరోసారి భారీ జాక్పాట్ కొట్టింది. వచ్చే ఐదేళ్ళలో సొంతగడ్డపై భారత్ ఆడనున్న మ్యాచ్ల ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ 6138 కోట్లకు దక్కించుకుంది. రెండురోజులుగా సాగిన ఈ వేలంలో స్టార్ నెట్వర్క్ రిలయన్స్, సోనీలను వెనక్కి నెట్టింది. దీంతో ఒక్కో మ్యాచ్కు సగటున 60 కోట్లు చెల్లించనుంది. గత సీజన్లో 3851 కోట్లకు మీడియా రైట్స్ దక్కించుకున్న స్టార్ ఈ సారి దాని కంటే 59 శాతం ఎక్కువగా వెచ్చించింది. 2018 నుంచి 2023 వరకూ టీమిండియా 102 మ్యాచ్లు ఆడనుండగా... తొలిసారి మీడియా హక్కులు భారీ స్థాయిలో అమ్ముడుపోయాయి. ఇప్పటికే స్టార్ నెట్వర్క్ ఐపీఎల్ ప్రసార హక్కులను కూడా 16వేల కోట్లకు పైగా వెచ్చించి దక్కించుకుంది. దీంతో రానున్న ఐదేళ్ళలో కేవసం ప్రసార హక్కుల అమ్మకం ద్వారానే 22 వేల కోట్ల వరకూ బీసిసిఐ ఆర్జించబోతోంది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







