బీసిసిఐ భారీ జాక్పాట్
- April 05, 2018
టీమిండియా ఆడే మ్యాచ్ల ప్రసార హక్కుల వేలంలో బీసిసిఐ మరోసారి భారీ జాక్పాట్ కొట్టింది. వచ్చే ఐదేళ్ళలో సొంతగడ్డపై భారత్ ఆడనున్న మ్యాచ్ల ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ 6138 కోట్లకు దక్కించుకుంది. రెండురోజులుగా సాగిన ఈ వేలంలో స్టార్ నెట్వర్క్ రిలయన్స్, సోనీలను వెనక్కి నెట్టింది. దీంతో ఒక్కో మ్యాచ్కు సగటున 60 కోట్లు చెల్లించనుంది. గత సీజన్లో 3851 కోట్లకు మీడియా రైట్స్ దక్కించుకున్న స్టార్ ఈ సారి దాని కంటే 59 శాతం ఎక్కువగా వెచ్చించింది. 2018 నుంచి 2023 వరకూ టీమిండియా 102 మ్యాచ్లు ఆడనుండగా... తొలిసారి మీడియా హక్కులు భారీ స్థాయిలో అమ్ముడుపోయాయి. ఇప్పటికే స్టార్ నెట్వర్క్ ఐపీఎల్ ప్రసార హక్కులను కూడా 16వేల కోట్లకు పైగా వెచ్చించి దక్కించుకుంది. దీంతో రానున్న ఐదేళ్ళలో కేవసం ప్రసార హక్కుల అమ్మకం ద్వారానే 22 వేల కోట్ల వరకూ బీసిసిఐ ఆర్జించబోతోంది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









