బీసిసిఐ భారీ జాక్పాట్
- April 05, 2018
టీమిండియా ఆడే మ్యాచ్ల ప్రసార హక్కుల వేలంలో బీసిసిఐ మరోసారి భారీ జాక్పాట్ కొట్టింది. వచ్చే ఐదేళ్ళలో సొంతగడ్డపై భారత్ ఆడనున్న మ్యాచ్ల ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ 6138 కోట్లకు దక్కించుకుంది. రెండురోజులుగా సాగిన ఈ వేలంలో స్టార్ నెట్వర్క్ రిలయన్స్, సోనీలను వెనక్కి నెట్టింది. దీంతో ఒక్కో మ్యాచ్కు సగటున 60 కోట్లు చెల్లించనుంది. గత సీజన్లో 3851 కోట్లకు మీడియా రైట్స్ దక్కించుకున్న స్టార్ ఈ సారి దాని కంటే 59 శాతం ఎక్కువగా వెచ్చించింది. 2018 నుంచి 2023 వరకూ టీమిండియా 102 మ్యాచ్లు ఆడనుండగా... తొలిసారి మీడియా హక్కులు భారీ స్థాయిలో అమ్ముడుపోయాయి. ఇప్పటికే స్టార్ నెట్వర్క్ ఐపీఎల్ ప్రసార హక్కులను కూడా 16వేల కోట్లకు పైగా వెచ్చించి దక్కించుకుంది. దీంతో రానున్న ఐదేళ్ళలో కేవసం ప్రసార హక్కుల అమ్మకం ద్వారానే 22 వేల కోట్ల వరకూ బీసిసిఐ ఆర్జించబోతోంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







