రెండేళ్లుగా తల్లిని ఫ్రిజ్ లో దాచిపెట్టిన కుటుంబ సభ్యులు
- April 05, 2018
అమ్మ అంటే ప్రేమ.. కాదు అమ్మ డబ్బులంటే ప్రేమ.. అందుకే ఆమె మరణించి రెండేళ్లైనా అంతిమ సంస్కారాలు చేయకుండా ఫ్రిజ్లో దాచి పెట్టాడు కొడుకు. పశ్చిమ బెంగాల్ కోల్కతా బెహాలా ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల బీనా మజుందార్ ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఆమెకు భర్త గోపాల్, కొడుకు సువవ్రతా మజుందార్ ఉన్నారు. రిటైర్మెంట్ నాటికి బీనా ఉన్నత పదవిలో ఉండడంతో పింఛను నెలకు రూ.50లు వచ్చేది. ఈ క్రమంలో ఆమె అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతి చెందింది.
బీనా మరణించిన విషయాన్ని మూడో కంటికి తెలియకుండా తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి ఇంటిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్రిజ్లో భద్రపరిచారు. ఎటువంటి దుర్వాసనా రాకుండా ఆమె మృత దేహానికి రసాయనాలు పూసి ఉంచారు. ఆమె మరణించినా వేలి ముద్రల సహాయంతో ప్రతినెలా ఫెన్షన్ ఆఫీసుకి వెళ్లి రూ.50లు తెచ్చుకునేవాడు కొడుకు. అయితే వీరి కుటుంబం పట్ల అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు బీనా ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటిలో ఓ డీప్ ఫ్రీజర్ను గుర్తించారు. దాన్ని తెరిచి చూడగా అందులో బీనా మృతదేహం కనిపించింది. పోలీసుల విచారణలో పింఛను కోసమే అలా చేసినట్లు బీనా భర్త 90 ఏళ్ల గోపాల్తో పాటు, కొడుకు సువవ్రతా అంగీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









