రెండేళ్లుగా తల్లిని ఫ్రిజ్ లో దాచిపెట్టిన కుటుంబ సభ్యులు

- April 05, 2018 , by Maagulf
రెండేళ్లుగా తల్లిని ఫ్రిజ్ లో దాచిపెట్టిన కుటుంబ సభ్యులు

అమ్మ అంటే ప్రేమ.. కాదు అమ్మ డబ్బులంటే ప్రేమ.. అందుకే ఆమె మరణించి రెండేళ్లైనా అంతిమ సంస్కారాలు చేయకుండా ఫ్రిజ్‌లో దాచి పెట్టాడు కొడుకు. పశ్చిమ బెంగాల్‌ కోల్‌కతా బెహాలా ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల బీనా మజుందార్ ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఆమెకు భర్త గోపాల్, కొడుకు సువవ్రతా మజుందార్ ఉన్నారు. రిటైర్మెంట్ నాటికి బీనా ఉన్నత పదవిలో ఉండడంతో పింఛను నెలకు రూ.50లు వచ్చేది. ఈ క్రమంలో ఆమె అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతి చెందింది. 

బీనా మరణించిన విషయాన్ని మూడో కంటికి తెలియకుండా తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి  ఇంటిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్రిజ్‌లో భద్రపరిచారు. ఎటువంటి దుర్వాసనా రాకుండా ఆమె మృత దేహానికి రసాయనాలు పూసి ఉంచారు. ఆమె మరణించినా వేలి ముద్రల సహాయంతో ప్రతినెలా ఫెన్షన్ ఆఫీసుకి వెళ్లి రూ.50లు తెచ్చుకునేవాడు కొడుకు. అయితే వీరి కుటుంబం పట్ల అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు బీనా ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటిలో ఓ డీప్ ఫ్రీజర్‌ను గుర్తించారు. దాన్ని తెరిచి చూడగా అందులో బీనా మ‌ృతదేహం కనిపించింది. పోలీసుల విచారణలో పింఛను కోసమే అలా చేసినట్లు బీనా భర్త 90 ఏళ్ల గోపాల్‌తో పాటు, కొడుకు సువవ్రతా అంగీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com