రెండేళ్లుగా తల్లిని ఫ్రిజ్ లో దాచిపెట్టిన కుటుంబ సభ్యులు
- April 05, 2018
అమ్మ అంటే ప్రేమ.. కాదు అమ్మ డబ్బులంటే ప్రేమ.. అందుకే ఆమె మరణించి రెండేళ్లైనా అంతిమ సంస్కారాలు చేయకుండా ఫ్రిజ్లో దాచి పెట్టాడు కొడుకు. పశ్చిమ బెంగాల్ కోల్కతా బెహాలా ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల బీనా మజుందార్ ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఆమెకు భర్త గోపాల్, కొడుకు సువవ్రతా మజుందార్ ఉన్నారు. రిటైర్మెంట్ నాటికి బీనా ఉన్నత పదవిలో ఉండడంతో పింఛను నెలకు రూ.50లు వచ్చేది. ఈ క్రమంలో ఆమె అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతి చెందింది.
బీనా మరణించిన విషయాన్ని మూడో కంటికి తెలియకుండా తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి ఇంటిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్రిజ్లో భద్రపరిచారు. ఎటువంటి దుర్వాసనా రాకుండా ఆమె మృత దేహానికి రసాయనాలు పూసి ఉంచారు. ఆమె మరణించినా వేలి ముద్రల సహాయంతో ప్రతినెలా ఫెన్షన్ ఆఫీసుకి వెళ్లి రూ.50లు తెచ్చుకునేవాడు కొడుకు. అయితే వీరి కుటుంబం పట్ల అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు బీనా ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటిలో ఓ డీప్ ఫ్రీజర్ను గుర్తించారు. దాన్ని తెరిచి చూడగా అందులో బీనా మృతదేహం కనిపించింది. పోలీసుల విచారణలో పింఛను కోసమే అలా చేసినట్లు బీనా భర్త 90 ఏళ్ల గోపాల్తో పాటు, కొడుకు సువవ్రతా అంగీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







