రష్యా ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ మిసైళ్ల కొనుగోలుకు భారత్ చొరవ
- April 06, 2018
న్యూఢిల్లీ : రష్యాతో రక్షణ ఒప్పందాలపై అమెరికా ఆంక్షలు విధించినా ఆ దేశం నుంచి ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ మిసైళ్ల కొనుగోలుకు భారత్ చొరవ చూపుతోంది. రూ 30,000 కోట్లతో రష్యా నుంచి క్షిపణి వ్యవస్థను ఆధునీకరించే దిశగా అడుగులు వేస్తోంది. అమెరికా ఆంక్షలు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినా రష్యా నుంచి క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయాలనే నిర్ణయంపై భారత్ ముందుకెళుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.
మరోవైపు అమెరికా ఆంక్షలతో ఒకప్పుడు అగ్రరాజ్యానికి మిత్ర దేశాలైన టర్కీ, ఖతార్, సౌదీఅరేబియాలకు ఎస్-400 మిసైళ్ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం నెలకొంది. ఇక భారత్, చైనాలు మాత్రమే ఎస్-400 ఎయిర్ మిసైళ్ల కస్టమర్లుగా రష్యా భావిస్తోంది. 350 కిమీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ మిసైల్స్ పలు శ్రేణుల్లో అందుబాటులో ఉంటాయి. మరోవైపు ఎస్-400పై రష్యాతో చైనా కూడా ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే మేథో సంపత్తి హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ చైనా రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా వెపన్ సిస్టమ్స్ను అభివృద్ధి చేసుకుంటుందనే ఆందోళనతో ఈ ఒప్పందంపై రష్యా వెనుకాడుతోంది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







