మలేసియా:పార్లమెంట్ రద్దు
- April 07, 2018
కౌలాలంపూర్ : మలేసియా పార్లమెంట్ను రద్దు చేస్తున్నట్లు ఆ దేశ ప్రధాని నజీబ్ రజక్ శుక్రవారం ప్రకటించారు. తన ఐదేళ్ళ పదవీ కాలం ముగియడానికి రెండు నెలలకు పైగా సమయం వున్నప్పటికీ కొత్తగా సార్వత్రిక ఎన్నికలకు మార్గం సుగమం చేస్తూ నజీబ్ రజక్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కోట్లాది డాలర్ల కుంభకోణం కేసు ఎదుర్కొంటున్న నజీబ్, పాలక పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. పార్లమెంట్ రద్దుకు రాజు ఆమోద ముద్ర పొందేందుకు గానూ సుల్తాన్ మహ్మద్ను కలిసినట్లు నజీబ్ చెప్పారు. శనివారం నుండి రద్దు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని రాజు సిఫార్సుచేసినట్లు నజీబ్ ఒక ప్రత్యేక ప్రకటనలో చెప్పారు. రద్దు చేసిన 60రోజుల్లోగా ఎన్నికలను నిర్వహించాల్సి వుంది.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







