ఐపీఎల్ మ్యాచ్లకు భారీగా భీమా కవరేజ్
- April 07, 2018
ఈ ఏడాది ఐపీఎల్ ట్వెంటీ20 క్రికెట్ లీగ్ బీమా కంపెనీలకు కాసులు కురిపిస్తోంది. నేటి నుంచి మే 27 వరకు ఐపీఎల్ సీజన్ కొనసాగనున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ కోసం అన్ని కేటగిరీల్లో కలిపి ఏకంగా రూ.2,500 కోట్లకు ఇన్సూరెన్స్ కవరేజీ తీసుకోవడం విశేషం. గతేడాది జరిగిన బీమా రూ1,300 కోట్లు కాగా, ఈ సారి ఏకంగా రెట్టింపు కావడం గమనార్హం.
ఒక్కో ఐపీఎల్ జట్టుపై రూ.40 కోట్ల బీమా తీసుకున్నారు. ఐపీఎల్ ఈవెంట్ కోసం ప్రసార మాధ్యమాలు తీసుకున్న రూ.1,500 కోట్ల బీమా కవరేజీ కూడా ఇందులో ఉంది. ఒకవేళ ఐపీఎల్ మ్యాచ్ లు కేన్సిల్ అయినా, ఆలస్యమైనా అందుకు వాటిల్లే నష్టాన్ని బీమా పరిహారం రూపంలో పూడ్చుకునేందుకు కంపెనీలు ఈ స్థాయిలో బీమా తీసుకున్నాయి.
ఇక మ్యాచ్ ల సమయంలో ఆటగాళ్లకు అయ్యే గాయాలకు కూడా కవరేజీ ఉంది. ఆటగాళ్ల ఫీజుల నష్టంపైనా బీమా తీసుకోవడం విశేషం. పరిహారం కోసం క్లెయిమ్ లు పెరిగిపోవడంతో ఈ ఏడాది బీమా సంస్థలు పాలసీల ప్రీమియాన్ని పెంచేశాయి.
తాజా వార్తలు
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం









