మర్డర్ మిస్టరీని 24 గంటల్లో ఛేదించిన ఆర్ఎకె పోలీస్
- April 07, 2018
రస్ అల్ ఖైమా:రస్ అల్ ఖైమా పోలీస్, ఓ మర్డర్ కేస్ని కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. అరబ్ వర్కర్ హత్యకేసుకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం. రస్ అల్ ఖైమా పోలీస్ - క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్లా అలి మెనఖాస్ మాట్లాడుతూ, అరబ్ వర్కర్ హత్యకు గురైనట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడయ్యిందని చెప్పారు. ఈ కేసు విచారణ కోసం ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేశామనీ, విచారణలో మృతుడి రూమ్ మేట్ ఈ హత్యకు కారకుడిగా గుర్తించామని అధికారులు తెలిపారు. తరచూ ఇద్దరి మధ్యా గొడవలు జరిగేవని నిందితుడు విచారణలో అంగీకరించాడు. ఓ సందర్భంలో గొడవలు ఎక్కువైపోయాయనీ, ఈ నేపథ్యంలో రూమ్ మేట్ నిద్రిస్తున్న సమయంలో నిందితుడు అతన్ని, కటింగ్ టూల్తో చంపేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. చంపేసిన తర్వాత మృతుడి నోట్లో విషాన్ని పోసి, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు నిందితుడు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









