మర్డర్ మిస్టరీని 24 గంటల్లో ఛేదించిన ఆర్ఎకె పోలీస్
- April 07, 2018
రస్ అల్ ఖైమా:రస్ అల్ ఖైమా పోలీస్, ఓ మర్డర్ కేస్ని కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. అరబ్ వర్కర్ హత్యకేసుకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం. రస్ అల్ ఖైమా పోలీస్ - క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్లా అలి మెనఖాస్ మాట్లాడుతూ, అరబ్ వర్కర్ హత్యకు గురైనట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడయ్యిందని చెప్పారు. ఈ కేసు విచారణ కోసం ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేశామనీ, విచారణలో మృతుడి రూమ్ మేట్ ఈ హత్యకు కారకుడిగా గుర్తించామని అధికారులు తెలిపారు. తరచూ ఇద్దరి మధ్యా గొడవలు జరిగేవని నిందితుడు విచారణలో అంగీకరించాడు. ఓ సందర్భంలో గొడవలు ఎక్కువైపోయాయనీ, ఈ నేపథ్యంలో రూమ్ మేట్ నిద్రిస్తున్న సమయంలో నిందితుడు అతన్ని, కటింగ్ టూల్తో చంపేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. చంపేసిన తర్వాత మృతుడి నోట్లో విషాన్ని పోసి, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు నిందితుడు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







