దుబాయ్ లో GIPT-GULF ALUMNI MEET-2015
- December 03, 2015
హైదరాబాదు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాలజీ పూర్వ విద్యార్ధుల సమావేశం 02. 12. 2015 న సాయంత్రం డేరా దుబాయ్ అబూ హెయిల్ లోటస్ గ్రాండ్ హోటల్ లో ఘనంగా జరిగింది. 1978 నుండి ఇప్పటిదాకా ఆ కళాశాలలో చదువుకున్న విద్యార్ధులలో దాదాపు 75 మంది కి పైగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో వివిధ ప్రింటింగ్ సంస్థలో పలు హోదాల్లో పని చేస్తున్నారు. అంతే కాకుండా ఇతర గల్ఫ్ దేశాల్లో కలిపి దాదాపు 120 మందికి పైగా గల్ఫ్ రీజియన్ లో ఉన్నారు. వారందరినీ ఒకే వేదిక పైకి తేవాలనే ఉద్దేశంతో దాదాపు 2 నెలలు శ్రమించి GIPT-GULF ALUMNI MEET-2015 సమావేశాన్ని రూపొందించారు. ఇందులో భాగంగానే ఇటీవల పదవీ విరమణ చేసిన తమ కళాశాల అధ్యాపకుల్ని ఆహ్వానించి వారిని సన్మానించారు. ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా శ్రీ మురళి , హరిప్రసాద్ వ్యవహరించగా సమన్వయకర్తలుగా రాజేష్ వేమూరి , కండే వెంకటేశ్వర్లు, తిరుపాల్ వ్యవహరించారు.గల్ఫ్ రీజియన్లో ప్రింటింగ్ టెక్నాలజీ కి అపారమైన ఉద్యోగావకాశాలు ఉన్నాయని ఇకపై గల్ఫ్ రీజియన్లో ఆ కళాశాలలో చదువుకున్న విద్యార్ధులకి మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించటానికి పూర్వ విద్యార్ధులంతా కృషి చేయాలని సమావేశంలో పాల్గొన్న వక్తలు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







