డ్రగ్స్: 11 మంది వలసదారుల అరెస్ట్
- April 09, 2018
మస్కట్: 11 మంది వలసదారులు డ్రగ్స్ కలిగి వున్నారనీ, డ్రగ్స్ని తీసుకున్నారనే అభియోగాల నేపథ్యంలో అరెస్టయినట్లు పోలీసులు తెలిపారు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ ఇషయాన్ని వెల్లడించింది. జనరల్ డిపర్ట్మెంట్ ఆఫ్ నార్కోటిక్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్, బౌషర్లో ఇద్దర్ని అరెస్ట్ చేసింది. రాయల్ ఒమన్ పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఆసియాకి చెందిన నిందితులు, హెర్బల్ మెటీరియల్ అలాగే, మరిజువానా పేపర్ రోల్స్ కలిగి వున్నారనీ, వారిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారి నుంచి డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారనీ, అలాగే 2,000 ఒమన్ రియాల్స్ పైగా నగదుని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపాయి. సదరన్ షర్కియా పోలీస్ డిపార్ట్మెంట్ - డిపార్ట్మెంట్ ఆఫ్ నార్కోటిక్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్ 11 మంది నిందితుల్ని గత నెలలో డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేశారు. నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







