గాజా సరిహద్దుల్లో రోజంతా కొనసాగిన ఘర్షణలు
- April 14, 2018
గాజా : ఇజ్రాయిల్, గాజా మధ్య సరిహద్దుల్లో పాలస్తీనా ప్రదర్శనకారులు, ఇజ్రాయిల్ సైనికుల మధ్య శుక్రవారం రోజంతా జరిగిన ఘర్షణల్లో ఒక పాలస్తీనియుడు మరణించగా దాదాపు వెయ్యి మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అష్రఫ్ అల్ కెద్రా విలేకర్లతో మాట్లాడుతూ, గాజా నగరానికి చెందిన 28ఏళ్ళ ఇస్లామ్ హెర్జల్లా ఇజ్రాయిల్ తుపాకీ కాల్పుల్లో మరణించాడని తెలిపారు. గాయపడిన వారిలో పేరా మెడికల్ సిబ్బందితో పాటు ఏడుగురు స్థానిక జర్నలిస్టులు, కెమెరామెన్లు వున్నారని తెలిపారు. వీరిలో తుపాకీ గుళ్ళ వల్ల గాయపడిన వారు 170మంది వున్నారని చెప్పారు. ఇజ్రాయిల్తో తూర్పు గాజాలో గల సరిహద్దుకు సమీపంలో వేలాదిమంది పాలస్తీనియన్లు నిరసనల్లో పాల్గన్నారు. వీరితో ఇజ్రాయిల్ సైనికులు ఘర్షణలకు దిగారు. ఇజ్రాయిల్ సైనికుల తుపాకీ కాల్పుల నుండి రక్షణ కోసం ఆందోళనకారులు పెద్దసంఖ్యలో టైర్లను తగలబెట్టారు. దట్టంగా కమ్ముకున్న పొగను అడ్డం చేసుకుని వారు తమని తాము కాపాడుకోవాల్సి వచ్చింది. ఇజ్రాయిలీ పతాకాలను దగ్ధం చేశారు. హమస్ ప్రతినిధి ఫజ్వి బర్హామ్ మాట్లాడుతూ, పాలస్తీనా భూమిని ఆక్రమించుకోవడం చట్టవిరుద్ధమని ప్రపంచానికి చాటి చెప్పడమే తమ లక్ష్యమని అందుకే ఇజ్రాయిల్ పతాకాలను దగ్ధం చేశామని చెప్పారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







