ఏపీ స్పెషల్ స్టేటస్ కై సంఘీభావంగా కువైట్ సోదరుల నిరసన

- April 20, 2018 , by Maagulf

కువైట్: కేంద్రం ఏపీకి చేసిన అన్యాయానికి నిరసనగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  తన పుట్టిన రోజున తలపెట్టిన దీక్షకు సంఘీభావంగా కువైట్లో తెలుగు దేశం కువైట్ ఆధ్వర్యంలో  20/4/2018 అనగా శుక్రవారం ఉదయం 10 గంటల  నుంచి ఫర్వానియా ద్వైహి పాలస్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అందరూ పాల్గొనడం జరిగింది.తెలుగుదేశం కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకరరావు  ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి మోహన్ బాబు అధికార ప్రతినిధిలు సుబ్బారెడ్డి, షేక్ బాషా, మైనారిటీ వింగ్ లీడర్ రహంతుల్లా, పి.ఆర్ ఓ.లు మద్దిన ఈశ్వర్ నాయుడు, ముస్తాక్ ఖాన్, మైనారిటీ వింగ్ సెక్రెటరీ అబ్దుల్ కరీమ్, టీమ్ శ్రీను, జైచంద్ర నాయుడు, సాయం శ్రీధర్, మేము సైతం నాగముని, సాయిక్రిష్ణ, శ్రీనివాసులు నాయుడు, బోయపాటి శ్రీను, గూడె నాగార్జున చౌదరి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com