రన్వేపై జారిపోయిన విమానం, ఎయిర్పోర్టు క్లోజ్
- April 20, 2018ఖట్మాండ్ : నేపాల్ రాజధాని ఖట్మాండ్లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను శుక్రవారం మూసివేశారు. 139 ప్రయాణికులతో టేక్ఆఫ్ అవబోతోన్న ఓ మలేషియన్ జెట్ రన్వేపై జారీపోవడంతో, విమానశ్రయాన్ని మూసివేసినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు. కానీ నేపాలి రాజధానికి రాబోతోన్న విమానాలన్నింటిన్నీ వేరే వైపుకు మరలిస్తున్నారు. రన్వేపై జారీపోయిన మలేషియన్కు చెందిన ఈ విమానం మలిండో ఎయిర్లైన్స్ బోయింగ్ 737 గా అధికారులు పేర్కొన్నారు. రన్వేకు 30 మీటర్ల దూరంలో గట్టిలోకి జారిపోయి, మట్టిలో ఈ విమానం కూరుకుపోయింది.
విమానంలో ఉన్న వారందరూ సురక్షితంగా ఉన్నట్టు ఎయిర్పోర్ట్ అధికార ప్రతినిధి ప్రేమ్ నాథ్ థాకూర్ చెప్పారు. విమానం ఇలా ప్రమాదానికి గురికావడానికి కారణలేమిటన్నది? ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. మట్టిలో కూరుకుపోయిన ఆ విమానాన్ని బయటికి తీసినట్టు థాకూర్ తెలిపారు. గత నెల క్రితం కూడా అమెరికా-బంగ్లా ఎయిర్వేస్ ఖట్మాండ్ ఎయిర్పోర్టులో ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో 51 మంది ప్రయాణికులు చనిపోయారు. 2015లో మార్చిలో టర్కిష్ ఎయిర్లైన్స్ జెట్ కూడా ల్యాండ్ అయ్యేటప్పుడు జారీపోవడంతో, ట్రిభువన్ ఎయిర్పోర్ట్ను 4 రోజులు మూసివేశారు. నేపాల్లో ఎయిర్ సేఫ్టీలో అత్యంత నిర్లక్ష్యంగా ఉన్నట్టు తెలుస్తోంది. నేపాల్లో పలు విమాన ప్రమాదాలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ కారణంతో యూరోపియన్ యూనియన్ ఎయిర్స్పేస్లో నేపాల్కు చెందిన ఎయిర్లైన్స్ ఎగరడానికి వీలులేకుండా నిషేధం విధించారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..