క్రిస్ గేల్కి అరుదైన గౌరవం
- April 21, 2018
కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ జట్టు ఓపెనర్ క్రిస్ గేల్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్లోని బెల్ని మోగించి గేల్ మ్యాచ్ను ప్రారంభించాడు. ఇప్పటివరకూ ఐపీఎల్ 11వ సీజన్లో జరిగిన మ్యాచుల్లో కింగ్స్ పంజాబ్ జట్టు తరఫున గేల్ రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. కానీ ఆడిన రెండు మ్యాచుల్లో 68, 103 పరుగులు చేసి తన సత్తా చాటుకున్నాడు. దీంతో ఇప్పుడు మూడో మ్యాచ్ ఆడుతున్న గేల్ ఈడెన్ గార్డెన్స్లో బెల్ని మోగించే అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. గతంలో టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ రాహుల్ ద్రవిడ్ సహా బ్రెట్ లీ, షేన్ వార్న్ తదితరులు ఈ బెల్ మోగించారు. ఇప్పుడు ఈ జాబితాలో క్రిస్ గేల్ కూడా చేరాడు.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయంలో అధునాతన ల్యాండింగ్ సదుపాయాలు!
- మీరు పోస్టాఫీసులో రోజుకు రూ.50 పెట్టుబడి పెడితే చాలు..
- యూరోపియన్ నేతల అత్యవసర సమావేశం
- ఏపీలో ప్రజల భద్రత కోసం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ గుప్తా
- కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
- సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చర్యలు చేపడుతున్నాం: హోం మంత్రి అనిత
- బుర్జుమాన్ మాల్ లో టిక్కెట్ లెస్ పార్కింగ్ సిస్టమ్..!!
- యూఏఈలో ప్రాథమిక ఉత్పత్తుల ధరల పెంపుపై మంత్రి క్లారిటీ..!!
- నాన్-ఆల్కహాలిక్ ఏల్ దుబాయ్లో ప్రారంభం..!!
- డ్రగ్స్ వినియోగం..మహిళకు పదేళ్ల జైలు శిక్ష, 100,000 దిర్హామ్ జరిమానా..!!