క్రిస్‌ గేల్‌కి అరుదైన గౌరవం

- April 21, 2018 , by Maagulf
క్రిస్‌ గేల్‌కి అరుదైన గౌరవం

కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మధ్య ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ జట్టు ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. ఈడెన్‌ గార్డెన్స్‌లోని బెల్‌ని మోగించి గేల్‌ మ్యాచ్‌ను ప్రారంభించాడు. ఇప్పటివరకూ ఐపీఎల్‌ 11వ సీజన్‌లో జరిగిన మ్యాచుల్లో కింగ్స్‌ పంజాబ్‌ జట్టు తరఫున గేల్‌ రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ ఆడిన రెండు మ్యాచుల్లో 68, 103 పరుగులు చేసి తన సత్తా చాటుకున్నాడు. దీంతో ఇప్పుడు మూడో మ్యాచ్‌ ఆడుతున్న గేల్‌ ఈడెన్‌ గార్డెన్స్‌లో బెల్‌ని మోగించే అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. గతంలో టీం ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ, సునీల్‌ గవాస్కర్‌, కపిల్‌ దేవ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సహా బ్రెట్‌ లీ, షేన్‌ వార్న్‌ తదితరులు ఈ బెల్‌ మోగించారు. ఇప్పుడు ఈ జాబితాలో క్రిస్‌ గేల్‌ కూడా చేరాడు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com