క్రిస్ గేల్కి అరుదైన గౌరవం
- April 21, 2018![1 క్రిస్ గేల్కి అరుదైన గౌరవం](https://www.maagulf.com/godata/articles/201804/52ff75631735c0d54b3003d0d016b4c9_1524310831.jpg)
కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ జట్టు ఓపెనర్ క్రిస్ గేల్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్లోని బెల్ని మోగించి గేల్ మ్యాచ్ను ప్రారంభించాడు. ఇప్పటివరకూ ఐపీఎల్ 11వ సీజన్లో జరిగిన మ్యాచుల్లో కింగ్స్ పంజాబ్ జట్టు తరఫున గేల్ రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. కానీ ఆడిన రెండు మ్యాచుల్లో 68, 103 పరుగులు చేసి తన సత్తా చాటుకున్నాడు. దీంతో ఇప్పుడు మూడో మ్యాచ్ ఆడుతున్న గేల్ ఈడెన్ గార్డెన్స్లో బెల్ని మోగించే అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. గతంలో టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ రాహుల్ ద్రవిడ్ సహా బ్రెట్ లీ, షేన్ వార్న్ తదితరులు ఈ బెల్ మోగించారు. ఇప్పుడు ఈ జాబితాలో క్రిస్ గేల్ కూడా చేరాడు.
తాజా వార్తలు
- ముంబైలో కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం
- ఒలంపిక్ టార్చ్తో మెగాస్టార్ చిరంజీవి..
- ఆగస్టులో ఉక్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని మోడీ..!
- హైదరాబాద్లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు
- కాల్పులు జరిపిన ప్రదేశం నుండే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా: డొనాల్డ్ ట్రంప్
- వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- Qiwa.. ప్రవాసులకు ఉచితంగా జాబ్ ధృవీకరణ పత్రాలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..