చైనా-భారత్ సంబంధాల్లో కొత్త శకం
- April 22, 2018
న్యూఢిల్లీ : చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో భారత ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఈ మేరకు చైనా పర్యటనలో ఉన్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటన చేశారు. ఇరుదేశాల సంయుక్త ప్రకటనలో మాట్లాడిన సుష్మా.. ఇరుదేశాల మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక ఒప్పందాలపై జిన్పింగ్తో మోదీ ఈ నెల 27, 28న అనధికారికంగా వుహన్ నగరంలో సమావేశం అవుతారని చెప్పారు.
ఈ కీలక భేటీ ద్వారా ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న వివాదాలకు ముగింపు పలికే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ భేటీ అనంతరం భారత్-చైనా సంబంధాల్లో గొప్ప ముందడుగు పడనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సిక్కింలోని నాథులా పాస్ గుండా మానస సరోవర యాత్రను తర్వలో పునఃప్రారంభించనున్నట్లు కూడా సుష్మా తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







