చైనా-భారత్ సంబంధాల్లో కొత్త శకం
- April 22, 2018
న్యూఢిల్లీ : చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో భారత ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఈ మేరకు చైనా పర్యటనలో ఉన్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటన చేశారు. ఇరుదేశాల సంయుక్త ప్రకటనలో మాట్లాడిన సుష్మా.. ఇరుదేశాల మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక ఒప్పందాలపై జిన్పింగ్తో మోదీ ఈ నెల 27, 28న అనధికారికంగా వుహన్ నగరంలో సమావేశం అవుతారని చెప్పారు.
ఈ కీలక భేటీ ద్వారా ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న వివాదాలకు ముగింపు పలికే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ భేటీ అనంతరం భారత్-చైనా సంబంధాల్లో గొప్ప ముందడుగు పడనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సిక్కింలోని నాథులా పాస్ గుండా మానస సరోవర యాత్రను తర్వలో పునఃప్రారంభించనున్నట్లు కూడా సుష్మా తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







