ఏప్రిల్ 27న కళాభవన్ ఆధ్వర్యంలో 'త్యాగరాజ మ్యూజికల్ ఫెస్టివల్'
- April 22, 2018మస్కట్: కళాభవన్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్, త్యాగరాజ మ్యూజిక్ ఫెస్టివల్ని ఏప్రిల్ 17న నిర్వహించనుంది. బౌషర్లోని బౌషర్ క్లబ్ హాల్లో ఈ ఈవెంట్ జరగనుంది. త్యాగరాజకి నివాళులర్పించే ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. కర్నాటక సంగీతంలో త్యాగరాజకి వున్న పేరు ప్రఖ్యాతులు అందరికీ తెలిసినవే. మస్కట్లో ఇండియన్ ఎంబసీ సెకెండ్ సెక్రెటరీ (కాన్సులర్) పికె నాయర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. తిరువారూర్లో 1767లో త్యాగరాజ జన్మించారు. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో వుంది ఈ ప్రాంతం. పలు రాగాల్లో పలు కృతిలను త్యాగరాజ కంపోజ్ చేశారు. భారతదేశానికి ఆయన అందించిన అమూల్యమైన సంపదగా వీటిని అభివర్ణిస్తుంటారు మ్యూజిక్ లవర్స్. ఒమన్లో గత 11 ఏళ్ళుగా త్యాగరాజ మ్యూజిక్ ఫెస్టివల్ని కళాభవన్ నిర్వహిస్తోంది. కర్నాటక సంగీతం, ఇండియన్ క్లాసికల్ డాన్స్, సినిమాటిక్ డాన్స్, కీబోర్డ్, తబలా, మృదంగం, డ్రమ్స్, ఇతర వాద్య పరికరాలు, వాటితోపాటుగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, అలాగే కరాటే వంటి వాటిల్లో శిక్షణ ఇస్తోంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు