బీభత్సం సృష్టించిన యువతులు..తప్పతాగి ఫుట్పాత్పై
- April 22, 2018
వీకెండ్ వస్తే చాలు హైద్రాబాద్ రోడ్లపై వెళ్లాలంటే హడలెత్తాల్సిందే. ! ఎవరూ ఏవైపు నుంచి తప్పతాగి యాక్సిడెంట్ చేస్తారో తెలియని పరిస్థితి. ఆఖరికి ఫుట్పాత్పై ఉన్నా..గ్యారంటీ లేకుండాపోయింది. తాజాగా కుషాయిగూడలో పూటుగా తాగిన యువతులు..అడ్డగోలుగా కారు డ్రైవింగ్ చేశారు. ఫుట్పాత్పైకి దూసుకెళ్లడంతో అక్కడే నిద్రిస్తున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
ఇంజినీరింగ్ చదువుతున్న నలుగురు యువతులు వీకెండ్ పార్టీ చేసుకున్నారు. ఏమాత్రం సోయి లేకుండా పీకలదాకా తాగారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దనే మినిమమ్ సెన్స్ కూడా లేకుండా బిహేవ్ చేశారు. కారుతో రోడ్డుపైకి ఎక్కి ర్యాష్ డ్రైవింగ్ చేశారు. ఫుట్పాత్పై నిద్రిస్తున్న వ్యక్తిపై నుంచి దూసుకెళ్లారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు మాత్రం..చావుబతుకుల మధ్య ఉన్న బాధితుడిని పట్టించుకోలేదు. నలుగురు యువతుల తల్లిదండ్రులతో బేరసారాలకు దిగారు. దీంతో ఇదంతా గమనిస్తున్న స్థానికులు..పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాకీలను నిలదీశారు.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









