బీభత్సం సృష్టించిన యువతులు..తప్పతాగి ఫుట్పాత్పై
- April 22, 2018వీకెండ్ వస్తే చాలు హైద్రాబాద్ రోడ్లపై వెళ్లాలంటే హడలెత్తాల్సిందే. ! ఎవరూ ఏవైపు నుంచి తప్పతాగి యాక్సిడెంట్ చేస్తారో తెలియని పరిస్థితి. ఆఖరికి ఫుట్పాత్పై ఉన్నా..గ్యారంటీ లేకుండాపోయింది. తాజాగా కుషాయిగూడలో పూటుగా తాగిన యువతులు..అడ్డగోలుగా కారు డ్రైవింగ్ చేశారు. ఫుట్పాత్పైకి దూసుకెళ్లడంతో అక్కడే నిద్రిస్తున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
ఇంజినీరింగ్ చదువుతున్న నలుగురు యువతులు వీకెండ్ పార్టీ చేసుకున్నారు. ఏమాత్రం సోయి లేకుండా పీకలదాకా తాగారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దనే మినిమమ్ సెన్స్ కూడా లేకుండా బిహేవ్ చేశారు. కారుతో రోడ్డుపైకి ఎక్కి ర్యాష్ డ్రైవింగ్ చేశారు. ఫుట్పాత్పై నిద్రిస్తున్న వ్యక్తిపై నుంచి దూసుకెళ్లారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు మాత్రం..చావుబతుకుల మధ్య ఉన్న బాధితుడిని పట్టించుకోలేదు. నలుగురు యువతుల తల్లిదండ్రులతో బేరసారాలకు దిగారు. దీంతో ఇదంతా గమనిస్తున్న స్థానికులు..పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాకీలను నిలదీశారు.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ