24 గంటలపాటు అప్రమత్తంగా వుండాలి: ఐఎండీ
- April 24, 2018
న్యూఢిల్లీ: ఆఫ్రికాలో ప్రచండ గాలుల ప్రభావంతో సముద్రంలో అలలు ఉప్పెనలా ఎగసిపడుతున్నాయి. వీటి ప్రభావంతో కేరళ తీరంలో 100 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆఫ్రికా గాలుల కారణంగా సముద్రంలో అలలు భారీగా విరుచుకుపడతాయని ప్రపంచ సునామీ హెచ్చరికల సంస్థ ఇన్ కాయిస్ పేర్కొంది. ఈ అలల ప్రభావం ఎక్కువగా భారత్ లోని తూర్పు, పశ్చిమ తీరాలపై ఉంటుందని ఇన్ కాయిస్ సంస్థ హెచ్చరించింది. సముద్ర తీర ప్రాంతంలో ఉండే వారు అప్రమత్తంగా ఉండాలని ఇన్ కాయిస్ హెచ్చరించింది. ఈ నెల 26వ తేదీ వరకూ ఈ ఆలలు ఎగిసిపడతాయని పేర్కొంది.
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. అండమాన్ తీరం నుంచి భారత్ ప్రధాన భూభాగం వైపు అలలు వస్తున్నాయని, తమిళనాడు, ఏపీ, ఒడిశా, బెంగాల్ తీరాల్లో అలలు అలజడి సృష్టిస్తాయని ఆ సంస్థ పేర్కొంది. పశ్చిమ తీరంలో కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక తీరాల్లోని అలలు అలజడి సృష్టిస్తాయని అంది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









