పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ 138
- April 25, 2018
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ వార్షిక నివేదికలో గత ఏడాది కన్నా భారత్ మరో రెండు స్థానాలు దిగజారిపోయింది. వాచ్డాగ్ మీడియా రిపోర్టర్స్ సాన్స్ ఫ్రంటియర్స్ బుధవారం వెల్లడించిన ఈ సూచీలో 180 స్థానాల్లో భారత్ 138వ స్థానానికి పడిపోయింది. గత ఏడాది 136వ స్థానంలో భారత్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సూచీలో నార్వే మరోమారు టాప్-1 నిలిచింది. భారత్లో జర్నలిస్టులను లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, రాడికల్ జాతీయ వాదులు జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కాశ్మీర్లో పాత్రికేయులకు వ్యతిరేకంగా హింసాకాండ చెలరేగుతోందని, అక్కడ విదేశీ విలేఖర్లను నిషేధించారని, ఇంటర్నెట్ సదుపాయాన్ని తరుచుగా తొలగిస్తున్నారని సాన్స్ ఫ్రంటియర్ వివరించింది. గత ఏడాది ముగ్గురు జర్నలిస్టులు హత్య గురయ్యారంటూ మోదీ పాలనలో పత్రికా స్వేచ్ఛకు ఎదురవుతున్న సవాళ్లను పేర్కొంది. జర్నలిజం చట్టబద్ధతను వివాదస్పదం చేయడం నిప్పుతో చెలగాటమేనని వాచ్డాగ్ సెక్రటరీ జనరల్ క్రిస్టోఫ్ డెలాయిర్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ









