పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ 138
- April 25, 2018
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ వార్షిక నివేదికలో గత ఏడాది కన్నా భారత్ మరో రెండు స్థానాలు దిగజారిపోయింది. వాచ్డాగ్ మీడియా రిపోర్టర్స్ సాన్స్ ఫ్రంటియర్స్ బుధవారం వెల్లడించిన ఈ సూచీలో 180 స్థానాల్లో భారత్ 138వ స్థానానికి పడిపోయింది. గత ఏడాది 136వ స్థానంలో భారత్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సూచీలో నార్వే మరోమారు టాప్-1 నిలిచింది. భారత్లో జర్నలిస్టులను లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, రాడికల్ జాతీయ వాదులు జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కాశ్మీర్లో పాత్రికేయులకు వ్యతిరేకంగా హింసాకాండ చెలరేగుతోందని, అక్కడ విదేశీ విలేఖర్లను నిషేధించారని, ఇంటర్నెట్ సదుపాయాన్ని తరుచుగా తొలగిస్తున్నారని సాన్స్ ఫ్రంటియర్ వివరించింది. గత ఏడాది ముగ్గురు జర్నలిస్టులు హత్య గురయ్యారంటూ మోదీ పాలనలో పత్రికా స్వేచ్ఛకు ఎదురవుతున్న సవాళ్లను పేర్కొంది. జర్నలిజం చట్టబద్ధతను వివాదస్పదం చేయడం నిప్పుతో చెలగాటమేనని వాచ్డాగ్ సెక్రటరీ జనరల్ క్రిస్టోఫ్ డెలాయిర్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









