కొత్త బస్ రూట్ని ప్రారంభించిన మవసలాత్
- April 26, 2018
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవసలాత్, కొత్త మస్కట్ - ఇబ్రి - బురైమి రూట్ని ప్రారంభించింది. ఏప్రిల్ 27 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మరింతగా విస్తరించే క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త రూట్స్ని ప్రారంభిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్లు అత్యంత భద్రతతో కూడుకున్నవని అధికారులు తెలిపారు. అల్ అజైబా స్టేషన్, మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, అల్ సహవా టవర్, నిజ్వా మార్కెట్, బాహ్లా మార్కెట్, ఇబ్రి, ధనక్ రౌండెబౌట్, సునయ్నాహ్ మీదుగా బురైమి చేరుకుంటాయి. టిక్కెట్లను బస్లోగానీ, కంపెనీ కార్యాలయంలోగానీ పొందవచ్చు. మస్కట్ - ఇబ్రి - బురైమి లైన్లో రోజుకి రెండు ట్రిప్స్ ఈ బస్సులు నడుస్తాయి. తొలి బస్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.30 నిమిషాలకు చేరుకుంటుంది. బురైమీ చేరుకునేసరికి సమయం 4 గంటలవుతుంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









